డబ్బుతో సెటిల్ చేయాలని చంద్రబాబు: వనజాక్షి, రిషికేశ్వరి ఇష్యూలపై రోజా
తిరుపతి: ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఉదంతంపై, నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలను చంద్రబాబు డబ్బుతో సెటిల్ చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఆ ఘటనలను డబ్బుతో సెటిల్ చేయాలని చంద్రబాబు చూడడం దుర్మార్గమని ఆమె అన్నారు. మంగళవారంనాడు తిరుపతిలో ఆమె యాంటి ర్యాగింగ్ పోస్టర్ను విడుదల చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. రిషితేశ్వరి ఘటనపై రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప స్పందించకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు.

రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో నాగార్జున విశ్వవిద్యాలయం విసిని, ప్రిన్సిపాల్ను అరెస్టు చేయాలని రోజా డిమాండ్ చేశారు. రిషితేశ్వరి ఘటనపై సిట్డింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆమె కోరారు. కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టిడిపి శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అదే విధంగా ర్యాగింగ్ కారణంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications