"సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి.. ఆనాడే అలా చేసుంటే.. ఇప్పుడిలా?"
నారాయణ కాలేజ్లో శ్రీవర్షలాంటి ఎంతో మంది ఆడపిల్లలు బలైపోతున్నా.. నారాయణ యాజమాన్యంపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
హైదరాబాద్ : కార్పోరేట్ కాలేజీల్లో వరుసగా విద్యార్థినుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆడపిల్లల తల్లిదండ్రులు కారుస్తున్న కన్నీటిలో టీడీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని మండిపడ్డారు.
తాజాగా హైదరాబాద్లోని ఎస్.ఆర్.నగర్ పరిధిలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థిని శ్రీవర్ష..మోతీనగర్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థినుల మరణాలపై స్పందించారు రోజా.
నారాయణ కాలేజ్లో శ్రీవర్షలాంటి ఎంతో మంది ఆడపిల్లలు బలైపోతున్నా.. నారాయణ యాజమాన్యంపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటిదాకా 21మంది ఆడపిల్లలు ఒక్క నారాయణ కాలేజీలోనే ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా రోజా పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులు ఉసురుపోసుకుంటుందని విమర్శించారు.

రాష్ట్రంలో మహిళా భద్రతా కరువైపోయిందని, విద్యార్థినులు, మహిళల పరిస్థితి చూస్తోంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో లావణ్య అనే అమ్మాయిని వెంటపడి వేధించి కారుతో గుద్ది చంపేసిన విషయాన్ని ఈ సందర్బంగా రోజా గుర్తు చేశారు. నంద్యాల ఆర్జీఎం కాలేజీలో ర్యాగింగ్ వేధింపులకు బలైపోయిన ఉషారాణి ఉదంతాన్ని గుర్తుచేశారు.
ఆడపిల్లల ఆత్మహత్యలను ఏకరువు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసిన రోజా.. సీఎం చంద్రబాబును కడిగిపారేశారు. తాను ఏంచేసినా చరిత్రే అని చెప్పుకునే చంద్రబాబు.. ఆడపిల్లల కన్నవాళ్ల కన్నీళ్లతో చరిత్ర రాస్తున్నారని అన్నారు. ఆడవాళ్లపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో, సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆరోపించారు.
అప్పట్లో ఆడవాళ్లను వేధించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకుని ఉంటే.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు రోజా. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే.. ఆయనకు వారి విలువ తెలియడం లేదని మండిపడ్డారు రోజా. ఆడపిల్లల ఆత్మహత్యలను అరికట్టడంలో విఫలమవుతున్న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును తక్షణం కేబినెట్ నుంచి తప్పించాల్సిందిగా డిమాండ్ చేశారు రోజా.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications