సజ్జల టెలికాన్ఫరెన్స్: టీడీపీ- జనసేన వ్యూహాలు వెల్లడి ..!!
అమరావతి: ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనితోపాటు లోక్సభ ఎన్నికలను ఎదుర్కోనుంది రాష్ట్రం. దీని కోసం అన్ని పార్టీలు సమయాత్తమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, జనసేన.. ఎన్నికల దిశగా కసరత్తు సాగిస్తోన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్- వై నాట్ 175 నినాదంతో దూసుకెళ్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. కొద్దిసేపటి కిందటే ఆయన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలతో మాట్లాడారు. పలు కీలక అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు.

వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుందని సూచించారు. దీనికి అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు. మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి క్యాడర్ మొత్తం సంసిద్ధంగా ఉండాలని, ప్రతిరోజూ కీలకమేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని చెప్పారు.
ఓటర్ల జాబితా సవరణల్లో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. దొంగఓట్లను తొలగించడం, అర్హులైన వారిని ఓటర్ల జాబితాలో చేర్పించడం వంటి పరిణామాలపై చురుగ్గా వ్యవహరించాలని అన్నారు సజ్జల. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఎన్నో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉంటూ వచ్చిన చుక్కల భూములు, అసైన్డ్ భూములను తాము పరిష్కరించామని సజ్జల గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, దీనివల్ల జరిగిన మేలు గురించి వివరించాలని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో పార్టీ పరిశీలకులు అత్యంత కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సజ్జల సూచించారు. వలంటీర్లపై హ్యూమన్ ట్రాఫికర్లు అనే ముద్ర వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోన్నామని స్పష్టం చేశారు. వలంటీర్లు, సచివాలయాల వల్ల ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు కలుగుతున్నాయని, వాటిపై ప్రతిపక్షాలు చేస్తోన్న విధ్వేషపూరిత ప్రచారంపై ఎదురుదాడి చేయాలని అన్నారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications