హైదరాబాదుపై కేంద్రమంత్రుల పట్టు, విభేదించిన కిషోర్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రుల బృందం(జివోఎం) ముందు హాజరైన సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు హైదరాబాదు కోసం పట్టుబట్టారు. జివోఎంతో కేంద్రమంత్రులు భేటీ అనంతరం జెడి శీలం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము సమైక్య రాష్ట్రం కోసం భేటీలో డిమాండ్ చేశామన్నారు. తమ మొదటి ప్రాధాన్యత సమైక్యమే అన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే వచ్చే ఇబ్బందులను తాము జివోఎం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. విభజన అనివార్యమైన పక్షంలో సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాకే ముందుకు వెళ్లాలని తాము కోరామన్నారు. పదకొండు అంశాల గురించి వారికి వివరించామన్నారు. గోదావరి నది నీటిని సద్వినియోగం చేసుకుంటే ఐదు రాష్ట్రాలకు నీరు అందుతుందన్నారు.

హైదరాబాదే
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ముప్పై లక్షల మంది సీమాంధ్రులు స్థిరపడ్డారని చెప్పారు. విభజన తప్పనిసరి అయితే హైదరాబాదును పుదుచ్చేరి తరహా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాదుతో సీమాంధ్రులకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. హెచ్ఎండియే పరిధిని యూటిగా చేయాలన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉందని, అలాంటి నగరం అందరిదీ అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను వారికి వినిపించామన్నారు. జివోఎంతో భేటీ అనంతరం తమకు కొంత నమ్మకం వచ్చిందన్నారు. సమస్యలు పరిష్కరిస్తారనే విశ్వాసం జెడి శీలం వ్యక్తం చేశారు. హైదరాబాదు చుట్టు అభివృద్ధి కేంద్రీకృతమై ఉందన్నారు. జివోఎం తమ మాట వింటుందనే నమ్మకం ఉందన్నారు.
విభేదించిన కిషోర్ చంద్రదేవ్
సీమాంధ్ర కేంద్రమంత్రులు హైదరాబాదు కోసం పట్టుబడుతుండగా మరో కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ మాత్రం జివోఎం భేటీలో వారితో విభేదించారు. విశాఖ అరవై ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, విభజన తర్వాత విశాఖను సీమాంధ్రకు రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖకు రాజధాని అయ్యే అర్హత ఉందన్నారు. 1953లో జస్టిస్ వాంచూ కమిషన్ అదే నివేదిక ఇచ్చిందన్నారు.
1973లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఇరవై తొమ్మిదవేల ఎకరాలు సేకరించారని, అందులో తొమ్మిదివేల ఎకరాలు నిరుపయోగంగా ఉందన్నారు. ఆర్థిక మండలి కోసం మరో తమ్మిదివేల ఎకరాలు సేకరించారని, ఈ పద్దెనిమిది వేల ఎకరాలలో పరిపాలనా భవనాలు నిర్మించుకోవచ్చునన్నారు. తక్షణమే భవనాలను అద్దెకు తీసుకొని పాలన సాగించవచ్చునన్నారు. విశాఖకు దగ్గరగా ఉన్న ఇథర పట్టణాల్లో పాలనా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు.
రాయలసీమ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రతో కలిసి ఉండేందుకు సిద్ధంగా లేరన్నారు. వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి లేదా తెలంగాణ ప్రాంతంలో కలపాలన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఆదాయాన్ని కొత్తగా ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి (సీమాంధ్ర) 25 అయిదేళ్లు ఇవ్వాలన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications