చంద్రబాబు కోసం ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఏపీ సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆరోపణలపై అరెస్టు చేయడంపై ఏపీలో హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది. ఎటువంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం వైసిపి నిరంకుశ పాలనకు నిదర్శనమని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబును ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలి అనేది జగన్ లక్ష్యమని, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.ఏపీలో మాత్రమే కాదు ఇటు తెలంగాణాలోనూ చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పోలీసులు అరెస్టులు, హౌస్ అరెస్టులతో టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబును మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరిచనున్నారు. ఏసీబీ కోర్టులో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి చంద్రబాబు కోసం వాదించనున్నారు.
సిద్ధార్థ లూద్రా ప్రస్తుతం ఆయన తన టీంతో కలిసి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నట్లు సమాచారం. విజయవాడ ఎసిబి కోర్టులో ఆయన చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్, ఏసీబీ కోర్టుకు తరలింపు నేపథ్యంలో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల కారణంగా ఏసిబి కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
గతంలో ఎమ్మెల్సీని ఓటుకు నోటు కేసులో ప్రలోభాపెట్టేందుకు ప్రయత్నించారని చంద్రబాబుపై నమోదైన కేసులో చంద్రబాబు నాయుడు తరపున వాదించిన న్యాయవాది సిద్ధార్థ లూద్రా ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరపున తన వాదనలు వినిపించనున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications