ఈ లోకంలో ఉండలేను: తన సమాధిని తానే కట్టుకున్నాడు, పోలీసుల జోక్యంతో. !
గుంటూరు: ఈ సమాజంపై విరక్తి పుట్టిన ఓ వృద్ధుడు తాను ఈ లోకంలో ఇక ఉండలేనంటూ తన సమాధిని తాను కట్టుకున్నాడు. అయితే, ఆయన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మాచర్లలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన తాతిరెడ్డి లచ్చిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక విషయాల్లో తలమునకలైపోయాడు. కుటుంబానికి కూడా గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నాడు.

కాగా, టీవల ఆయన 'సమాజం నాకు నచ్చడం లేదు.. అందుకే దేవుడి దగ్గరకు వెళ్లేందుకు సజీవ సమాధి అవుతాను' అంటూ తన పొలంలో సమాధి కట్టించాడు. అందులోకి వెళ్లేందుకు జిల్లా కలెక్టర్, పోలీసుల అనుమతి కోరాడు. ఊర్లో వారికీ చెప్పాడు. దీనిలో భాగంగా గురువారం సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు.
అయితే, కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామీణ ఎస్ఐ లోకేశ్వరరావు.. సమాధి కావాలన్న తాతిరెడ్డి ప్రయత్నాలను అడ్డుకున్నారు. చట్టరీత్యా ఇలాంటి పనులు చేయకూడదంటూ నచ్చజెప్పారు. ఆయనకు పలు విషయాలపై అవగాహన కల్పించడంతో ఎట్టకేలకు తన యత్నాన్ని విరమించుకున్నాడు తాతిరెడ్డి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications