పొన్నూరులో టీడీపీకి వైఎస్సార్సీపీ బిగ్ షాక్.. ! స్థానిక ఎన్నికల వేళ ..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్న అధికార టీడీపీ (TDP)కి గుంటూరు జిల్లా పొన్నూరులో మాత్రం షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి సొంత పార్టీ నాయకులే గుడ్ బై చెప్పేస్తున్నారు. పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్సార్సీపీ ( YSRCP) స‌మ‌న్వ‌య‌క‌ర్త అంబ‌టి ముర‌ళి నేతృత్వంలో భారీ సంఖ్య‌ల‌తో యువ‌త‌, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్సార్సీపీలో చేరారు. దీంతో స్ధానిక ఎన్నికల వేళ వైసీపీకి ఇదో శుభపరిణామం కానుంది.

టీమిండియా మాజీక్రికెటర్ రిటైర్మెంట్..! జగన్ ఎమోషనల్ ట్వీట్..!
టీమిండియా మాజీక్రికెటర్ రిటైర్మెంట్..! జగన్ ఎమోషనల్ ట్వీట్..!

పొన్నూరు నియోజకవర్గంలో తాజాగా గిట్టుబాటు ధరల వ్యవహారంలో ప్రశ్నించిన రైతుల్ని వైఎస్సార్సీపీ పేరుతో ప్రభుత్వం టార్గెట్ చేసింది. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులపై అధికార పార్టీ నేతలు పోలీసుల సమక్షంలోనే దాడులకు దిగారు. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో పరిస్దితి మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారీ ఎత్తున టీడీపీ నాయకులు, క్యాడర్ వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబు రెండేళ్ల పాలన చూస్తే రాష్ట్ర ప్ర‌జ‌ల‌ మీద క‌క్ష క‌ట్టిన‌ట్టుగానే ఉందని, రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైయ‌స్సార్సీపీ శ్రేణులే ల‌క్ష్యంగా మొద‌లైన అణ‌చివేత, దాడులు ఇప్పుడు అన్ని వ‌ర్గాల మీద త‌మ ప్ర‌తాపం చూపించే వ‌రకు వెళ్లాయ‌ని ఆరోపించారు.

Setback for TDP in Ponnuru as Nearly 100 Families Switch to YSRCP Ahead of Local Body Polls
అక్వా ఫీడ్ ధరలపై తేల్చేసిన ఏపీ సర్కార్..! రైతుల కోర్టుల్లోకి బంతి..!
అక్వా ఫీడ్ ధరలపై తేల్చేసిన ఏపీ సర్కార్..! రైతుల కోర్టుల్లోకి బంతి..!

పొన్నూరు నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ క్యాడర్ ను ఆయన కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నూరులో చట్టమే రౌడీయిజానికి పాల్పడుతోందని, ఎమ్మెల్యే ధూళిపాళ్ల దౌర్జ‌న్యాలు, అరాచ‌కాలు, రౌడీయిజం తారాస్థాయికి చేరుకున్నాయని ఆరోపించారు. చ‌ట్టాన్ని దుర్వ‌నియోగం చేసి అవ‌హేళ‌న చేస్తున్నాడని, పొన్నూరు ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలను జనం చూస్తున్నారని తెలిపారు. మామిళ్ల‌పల్లి ఘటనలో పోలీసుల పనితీరు జాతీయ స్థాయిలో వివాదాస్పదమైందని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రైతుల‌ను పెడుతున్న వేధింపులు, ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు భ‌రించ‌లేక ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే వైయ‌స్సార్సీపీ లోకి చేరుతున్నార‌ని పార్టీ పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త అంబ‌టి ముర‌ళి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+