AP Elections: ఏపీలో పథకాల డబ్బులు అప్పుడే-ఈసీ క్లారిటీ..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మే నెలలో లబ్దిదారులకు ఇవ్వాల్సిన నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఇవాళ క్లారిటీ ఇచ్చేసింది.
ఇప్పటికే పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వానికి ఈసీ నుంచి క్లారిటీ లభించింది. అలాగే ఈ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు కూడా స్పష్టత వచ్చినట్లయింది.

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే మేనెలలో విడుదల చేయాల్సిన సంక్షేమ పథకాల నిధులకు సీఎం జగన్ బటన్ నొక్కేశారు. అయితే ఈ నిధుల విడుదల మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ నిధుల విడుదలకు సిద్దమైన ప్రభుత్వానికి ఈసీ గతంలోనే షాకిచ్చింది. మేనెలలో విడుదల కావాల్సిన విద్యాదీవెన, రైతు భరోసా నిధుల్ని విడుదల చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేయడంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈసీ వాదనలు వినిపిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాల నిధులు వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఏంటో చెప్పాలని కోరినట్లు తెలిపింది. దీంతో హైకోర్టు కూడా ఈసీకి ఈ విషయంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలను ఎన్నికలు ముగిసేలోపు విడుదల చేయొద్దంటూ తాజాగా ఈసీ మార్గదర్శకాలు పంపింది. ఎన్నికలు ముగిశాక పథకాల నిధులు విడుదల చేసుకోవచ్చని సూచించింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications