కొలిచిన వారికి కొంగుబంగారం: తిరుచానూరు ఆలయంలో వచ్చే నెల పొడవునా

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ నెల పొడవునా వైభవంగా జరగనున్న పూజా కార్యక్రమాల, విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆగమ నియమాల ప్రకారం శాస్త్రోక్తంగా వీటిని నిర్వహించనున్నట్లు తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం క్యూలైన్లు, ఇతర సదుపాయాల విషయంలో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోన్నారు.

తిరుచానూరు ఆలయంలో అమ్మవారు భక్తులకు విశేష సేవలలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం అంటే సెప్టెంబరు 4, 11, 18, 25వ తేదీల్లో సాయంత్రం 6 గంటలకు అమ్మవారు తిరుచ్చి వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. సెప్టెంబర్ 22న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు పద్మావతి అమ్మవారికి అత్యంత వైభవంగా గజవాహన సేవను నిర్వహించనున్నారు.

Several special festivals and sevas will be conducted at Tiruchanoor Temple Agama traditions in September

తిరుచానూరు ఉపాల్లో కూడా ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబరు 4న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 7 గంటలకు శ్రీ బలరామకృష్ణస్వామి ఆలయంలో శ్రీ కృష్ణస్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. 13న శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, 27న శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో భక్తులకు ప్రత్యేక తిరుచ్చి వాహన సేవలు అందుబాటులో ఉంటాయి. అటు తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో ప్రతి శనివారం వేంకటేశ్వరస్వామి మూలవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఈ విశేష పూజలలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను కల్పిస్తున్నారు.

శ్రీవారి లడ్డూ విషయంలో ఆ వార్తలను నమ్మొద్దు: టీటీడీ
శ్రీవారి లడ్డూ విషయంలో ఆ వార్తలను నమ్మొద్దు: టీటీడీ

అప్పలాయగుంటలోని ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ నెల పొడవునా భక్తి ఉత్సవాలు సాగనున్నాయి. 1వ తేదీన ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవతో ఈ ఆధ్యాత్మిక సేవలు ప్రారంభమౌతాయి. ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, భగవంతునికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. 9న అర్చకులు అష్టోత్తర శత కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరపనున్నారు.

ప్రతి ఆదివారం ఉదయం ఇక్కడి ప్రసన్న ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ ఉంటుంది. ఈ రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో అత్యంత ప్రధాన ఘట్టం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం. దీన్ని 23వ తేదీన వైభవంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రత్యేక ఉత్సవాల వేళల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు భద్రతతో పాటు ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+