పోలీసుల రైడ్: ప్లాట్ నుండి దూకేసిన ముంబై యువతి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పద్యావతినగర్ కాలనీ రెసిడెన్సీలోని ఓ ప్లాట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పంజాగుట్ట పోలీసులకు శుక్రవారం అర్ధరాత్రి సమాచారం అందింది. తమపై పోలీసులు దాడి చేస్తున్నారన్న విషయాన్ని గమనించిన ఓ ముంబై సెక్స్ వర్కర్ ప్లాట్ బాల్కనీ నుంచి బైటకు వచ్చింది.
ఆ ప్లాట్ రెండో ఫ్లోర్లో ఉంది. ఆమె బాల్కనీ నుండి పైప్ లైన్ ద్వారా మొదటి ఫ్లోర్లోకి దిగింది. అక్కడి నుండి కిందకు దిగేందుకు పైప్ లైన్ లేదు. దీంతో ఆమె అక్కడి నుండి కిందకు దూకింది. ఆమె చేతికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం రెస్క్యూ హోంకు తరలించారు.
బాధితురాలు ముంబైకి చెందిన యువతి. మరో వ్యక్తి పరుగులు తీశాడు. ఆమెతో పాటు వ్యభిచారం సహ నిర్వాహకుడిగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన మోహన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని రిమాండుకు తరలించారు.
కాగా, జూబ్లిహిల్సులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సినీ ఫైనాన్షియర్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు, ఓ మహిళ, విద్దరు విటులను టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి పట్టుకున్నారు.