గిరిజన మహిళపై అత్యాచారం: పండ్లవ్యాపారి హత్య
విజయవాడ: నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం కారూరులో ఓ గిరిజన మహిళ అత్యాచారానికి గురైంది. జనవరి 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిరిజన మహిళ(42)పై వెంకటేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో గూడూరు డీఎస్పీ విచారణ చేస్తున్నారు.
ఇదిలావుంటే, గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు హార్టీకల్చర్ ఫామ్ వద్ద సోమవారం రాత్రి జరిగింది. కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ఎస్కె జాకీర్ హుస్సేన్ (27) అరటి పండ్ల వ్యాపారం చేసేవాడు.
సోమవారం కూడా ఎప్పటిలాగే ఆటోతో బేరానికి వెళ్లాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడికి ఎవరితోనూ గొడవలులేవని వారు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.