జగనన్న కోస త్యాగం: తెలంగాణలో షర్మిల ప్రచారం

వైయస్ జగన్, వైయస్ విజయమ్మ సీమాంధ్రపై దృష్టి కేంద్రకరిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రాల్లో ప్రచార వ్యూహం రూపకల్పనపై వైయస్ జగన్ గురువారంనాడు పార్టీ నాయకులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు.
తెలంగాణ బాధ్యతలు మొత్తం షర్మిల భుజాలపై మోపుతారని, ఆమె తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తారని అంటున్నారు. అయితే, నామినేషన్ల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ఆమె ఎప్పుడు ప్రచారం ప్రారంభిస్తారనేది మాత్రం ఇంకా తేలలేదు.
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు 104 శాసనసభా స్థానాలకు 13 లోకసభ స్థానాలకు పోటీ చేస్తోంది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో 117 శాసనసభా స్థానాలు, 19 లోకసభ స్థానాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications