సాయిశ్రీ చనిపోవడానికి 2 రోజుల ముందే లీగల్ నోటీసులు పంపిన శివకుమార్
దుర్గాపురంలో లుకేమియా వ్యాధితో బాధపడుతూ రెండు రోజుల క్రితం మరణించిన మాదంశెట్టి వెంకటసాయికృష్ణ శివశ్రీ తల్లి సుమశ్రీకి చిన్నారి తండ్రి శివకుమార్ లీగల్ నోటీసులు పంపాడు.
విజయవాడ: దుర్గాపురంలో లుకేమియా వ్యాధితో బాధపడుతూ రెండు రోజుల క్రితం మరణించిన మాదంశెట్టి వెంకటసాయికృష్ణ శివశ్రీ తల్లి సుమశ్రీకి చిన్నారి తండ్రి శివకుమార్ లీగల్ నోటీసులు పంపాడు.
సాయిశ్రీ చనిపోవడానికి రెండు రోజుల ముందే ఈ లీగల్ నోటీసులు శివకుమార్ పంపాడు.పోస్టు ద్వారా ఈ లీగల్ నోటీసులు శివకుమార్ పంపాడు.

నువ్వు పాపతో కలిసి ఫ్లాట్ ను ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలి. అందులో నీకు సంబంధించిన వారెవరు ఉండడానికి వీల్లేదు. అంటూ నోటీసులో పేర్కొన్నారు. అయితే తాజాగా మంగళవారం నాడు సుమశ్రీతో పాటు ఆమె సోదరులు, తోబుట్టువులు , స్నేహితులకు పేరు పేరున కేవియట్ అందాయి.
మీరంతా నా ఇంట్లో ఉంటున్నారు. ఖాళీ చేయమన్నా చేయడం లేదు. మీరు కోర్టుకు రండి అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫ్లాట్ ను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆ నోటీసులో ఉంది.
నన్నపనేని రాజకుమారి పరామర్శ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మంగళవారం నాడు సుమశ్రీని పరామర్శించారు. శివకుమార్, సుమశ్రీకి మధ్య గల వివాదాలను ఆమె అడిగి తెలుసుకొన్నారు. డబ్బులుండీ కూడ నా కుమార్తెకు శివకుమార్ వైద్యం చేయించలేదు. అతడి నిర్లక్ష్యం వల్లే శివశ్రీ చనిపోయింది. శివకుమార్ కు శిక్షపడాలి అని నన్పపనేనిని సుమశ్రీ కోరారు. అయితే ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా శివకుమార్ కు శిక్షపడేలా చేస్తామని నన్నపనేని హామీ ఇచ్చారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications