హరికృష్ణకు షాక్: రాజీనామాలు చేయని ముగ్గురు

సమైక్యాంధ్ర కోసం కొరడాలతో కొట్టుకున్న శివప్రసాద్ సహా ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అసలు రాజీనామానే చేయలేదనే విషయంపై వేడిగా చర్చ జరుగుతోంది. లోకసభలో వారు ఆందోళనకు కూడా దిగారు. లోక్సభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారంటూ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన జాబితాలో టిడిపికి చెందిన నారాయణరావు పేరు తప్ప, మిగతా ముగ్గురి పేర్లు లేకపోవడం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ లోక్సభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు తెలుగుదేశానికి చెందిన నలుగురు సీమాంధ్ర ఎంపీలు ప్రకటించటం తెలిసిందే. అనంతర పరిణామాల్లో రాజీనామా లేఖలను స్పీకర్ మీరాకుమార్కు ఇచ్చేసినట్టు నారాయణరావు, వేణుగోపాల్ రెడ్డి, కిష్టప్ప, శివప్రసాద్లు ప్రకటించారు కూడా. అయితే స్పీకర్ కార్యాలయం వెల్లడించిన జాబితా ప్రకారం తెలుగుదేశానికి చెందిన నారాయణరావు రాజీనామా లేఖ మాత్రమే మీరాకుమార్ పరిశీలనలో ఉంది.
దీన్నిబట్టి మిగతా ముగ్గురు టిడిపి ఎంపీలు శివప్రసాద్, కిష్టప్ప, వేణుగోపాల్ రెడ్డి తమ సభ్యత్వాలకు రాజీనామా చేయనట్టేనని అంటున్నారు. అయితే, వీళ్లంతా స్పీకర్ పోడియం వద్ద పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తే, ఎంపీ శివప్రసాద్ ఒకడుగు ముందేకేసి విచిత్ర వేషాలు, విన్యాసాలతో సభలో అలజడి సృష్టించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications