ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప కు షాక్ .. ప్రచారానికి రావొద్దని నిరసన
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతుంటే, జాతీయ నాయకులతో ప్రచారం నిర్వహిస్తుంటే మరో పక్క టీడీపీ లోని కీలక మంత్రులకు ప్రచారంలో నిరసన సెగ తగులుతుంది.
అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత , ఉపముఖ్యమంత్రి అయిన చినరాజప్పకు ప్రచారంలో గట్టి షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీకి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి హుస్సేన్ పురంగ్రామానికి వెళ్ళిన ఆయనను గ్రామస్థులు అడ్డుకున్నారు. సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో సమస్యలు పరిష్కరించని చినరాజప్ప ఏ ముఖం పెట్టుకుని గ్రామంలోకి వచ్చి ఓట్లు అడుగుతారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మకాయల చినరాజప్పను ప్రచారానికి రావద్దు అంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. రాజప్ప.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)

మంత్రి చినరాజప్ప హుస్సేన్ పురం గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేసినా, వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకుండా ఆందోళన చేయడంతో చేసేదేమీ లేక చినరాజప్ప ప్రచారం నుంచి వెనుదిరిగారు. దీంతో టీడీపీకి కొన్ని చోట్ల ప్రతికూల పవనాలు వీస్తున్నాయని అర్ధం అవుతుంది. ముఖ్యంగా మంత్రులు బరిలోకి దిగిన నియోజకవర్గాలలోనే వ్యతిరేఖత ఉండటం గమనార్హం .
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications