శభాష్ నారా లోకేష్..!వరల్డ్ కప్ క్రికెటర్ స్మృతీ మంథన ప్రశంసలు..!
ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కు ఓ అరుదైన ప్రశంస దక్కింది. స్వరాష్ట్రంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఏకంగా మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యురాలైన స్మృతీ మంథనను మెప్పించింది. దీంతో ఆమె తాజాగా లోకేష్ పై ప్రశంసల జల్లు కురిపించారు. లోకేష్ తీసుకున్న ఆ నిర్ణయం ఇతర రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు సైతం స్ఫూర్తి నిస్తుందని స్మృతీ వ్యాఖ్యానించింది. దీంతో ఈ వీడియోను లోకేష్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్టు చేశారు.
ఈ ఏడాది విశాఖలోని వీసీఏ-ఏడీసీఏ స్టేడియంలో ఓ స్టాండ్ కు మహిళా క్రికెటర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అమలు చేసింది. ఈ విషయం తెలిసి దేశంలో పలువురు మహిళా క్రికెటర్లు స్పందించారు. ఇందులో భాగంగా కర్నాటకకు చెందిన భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతీ మంథాన కూడా స్పందించింది. అయితే లోకేష్ ఇప్పుడు వరల్డ్ కప్ నేపథ్యంలో ఆ వీడియోను షేర్ చేసుకున్నారు.

ఈ ఏడాది ఆగస్టులో 'రాండమ్ ఐడియా'అనే పేరుతో జరిగిన ఓ చర్చలో స్మృతి మంధాన తాను మహిళా క్రికెటర్ల పేరు మీద స్టాండ్లకు పేరు పెట్టడాన్ని ప్రస్తావించిందని లోకేష్ తెలిపారు. గత నెలలో, వైజాగ్ స్టేడియంలోని ఒక స్టాండ్ను లెజెండ్ మిథాలీ రాజ్కు అంకితం చేయడం ద్వారా తాము ఆ ఆలోచనను ఆచరణలోకి తెచ్చినట్లు వెల్లడించారు. క్రీడలలో మహిళలకు నిధులు సమకూర్చడానికి ,సాధికారత కల్పించడానికి తాము అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
At an interaction in August, Smriti Mandhana shared what she called a ‘random idea’ - to name stands after women cricketers. Last month, we turned that idea into action by dedicating a stand at the Vizag stadium to the legend, Mithali Raj. We’re driving several initiatives to… pic.twitter.com/yPvxHcXIKk
— Lokesh Nara (@naralokesh) November 4, 2025
ఇదంతా ఒక సాధారణ ఆలోచనతో ప్రారంభమవుతుందని నారా లోకేష్ తెలిపారు. ఇతర క్రికెట్ సంఘాలు కూడా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని లోకేష్ కోరారు. అదే విషయాన్ని ఈ వీడియోలో స్మృతీ మంథన కూడా సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాల్లో పురుష క్రికెటర్ల పేర్లే స్టాండ్లకు పెడుతున్నారని, కానీ ఏపీలో మాత్రమే విశాఖ స్టేడియానికి ఇలా మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి పేరు పెట్టారని స్మృతీ తెలిపింది. ఈ విషయంలో లోకేష్ ను స్మృతీ ప్రశంసించింది. ఈ చర్చలో భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం కామెంటేటర్ గా ఉన్న మిథాలీ రాజ్ కూడా ఉన్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications