టిలో సమస్యలు: నటుడు సుమన్, సహకరించాలని..
కరీంనగర్/హైదరాబాద్: నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో సమస్యలుంటాయని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర చెట్టుగా జమ్మి చెట్టు, రాష్ట్ర పువ్వుగా తంగేడు పువ్వును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

విద్యాశాఖ మంత్రులతో రేపు గవర్నర్ భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో బుధవారం గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం 4గంటలకు ఈ సమావేశం జరుగనుంది.
ఈసీని కలిసిన ఖమ్మం ఎమ్మెల్యేలు
ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ను కలిశారు. భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్యలు తమ నియోజకవర్గాల్లోని మండలాలు ఏపీలో కలిపినందున.. 2019 ఎన్నికలయ్యే వరకు రెండు రాష్ర్టాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని భన్వర్లాల్కు విజ్ఞప్తి చేశారు.
నీరజామాథుర్తో ఎంపీ వినోద్ భేటీ
న్యూఢిల్లీ: సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ నీరజామాథుర్తో తెలంగాణ ఎంపీ వినోద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల భేటీ ముగిసింది. ప్రభుత్వ ప్రతినిధులు పీపీఏల అమలుపై నీరజామాథుర్తో చర్చించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ర్టాన్ని ఆదుకోవాలని నీరజామాథుర్కు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications