వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైరాం పగటి వేషగాడు: సోమిరెడ్డి, చెరపట్టాడని ఫైర్

|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్/నెల్లూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్రమంత్రి జైరాం రమేష్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. రాష్ట్ర విభజనకు కారణమైన జైరాం రమేష్ ఇప్పుడు పగటి వేషగాడిలా సీమాంధ్రలో తిరుగుతున్నాడని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రామాయణంలో సీతను రావణుడు చెరబట్టినట్లు కేంద్రమంత్రి జైరాం రమేష్ సీమాంధ్ర ప్రజలను చెరపట్టాడని ఆరోపించారు.

రెంటల్ పార్టీగా మారింది: టిడిపిపై ఆనం

తెలుగుదేశం పార్టీపై కాంగ్రెస్ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి రెంటల్ పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు, కార్యకర్తలు కరువయ్యారని, టిడిపి కేవలం ఫ్లెక్సీల్లో మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.

నెల్లూరు నగరంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అందరి అభిమానం పొందిన వారినే మేయర్‌గా ఎంపిక చేస్తామని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆనం వివేకానంద రెడ్డి చెప్పారు. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులందరూ మంచి మార్కులతో పాస్ కావాలని, అందుకోసమే ప్రతీ విద్యార్థికి గ్రీటింగ్ కార్డులు పంపిస్తున్నానని ఆనం తెలిపారు.

English summary
Telugudesam Party senior leader Somireddy Chandramohan Reddy on Tuesday fired at Union Minister Jairam Ramesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X