మోడీ టూర్ సక్సెస్-బీజేపీ నేతలకు సోము అభినందనలు-ఇకపై మనం చేయాల్సిందిదే..
ప్రధాని మోడీ విశాఖ టూర్ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీతో పాటు వైసీపీ ప్రభుత్వం కూడా తలోచేయి వేయడంతో జన సమీకరణతో పాటు మరే ఇతర అంశంలోనూ ఎలాంటి సమస్యల్లేకుండా అంతా సజావుగా సాగిపోయింది. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
వైజాగ్ లో ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత నగరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో బీజేపీ ఉత్తరాంధ్ర నేతలతో ఆయన మాట్లాడారు. వారితో పలు కీలక విషయాల్ని చర్చించారు. ముందుగా ప్రధాని మోడీ టూర్ విజయవంతం చేసిన స్ధానిక బీజేపీ నేతల్ని సోము వీర్రాజు ప్రశంసించారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమ ఇంఛార్జులు, వివిధ విభాగాల బాధ్యులను సోము అభినందించారు.

అనంతరం ప్రధాని మోడీ టూర్ విజయవంతం చేయడానికి స్థానిక నాయకత్వం శ్రమించిన తీరు అభినందనీయం అని సోము వీర్రాజు ప్రశంసించారు. ప్రధానితో జరిగిన కార్యక్రమంలో జరిగిన చర్చ , రాజకీయ అంశాలు ఆధారంగా భవిష్యత్తులో పార్టీ ప్రగతిపై నేతలతో సోము వీర్రాజు సమీక్షించారు. ప్రధాని ఇచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా భవిష్యత్తులో పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అభ్యర్థన ఏదైనా ప్రధాని, కేంద్ర కార్యాలయం నుండి త్వరితగతిన స్పందన లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని పార్టీ అభివృద్ధికి ఎలా వినియోగించుకోవాలి, మన సామర్ధ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి వంటి అంశాలపై నేతలతో సోము చర్చించారు. ఈ మేరకు రెండు రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం అయినట్లు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది.

-
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications