అనకాపల్లి, తిరుపతి ప్రయాణికులకు రైల్వే బిగ్ అలర్ట్..!
అనకాపల్లి నుంచి తిరుపతికి, అలాగే తిరుపతి నుంచి అనకాపల్లికి ప్రయాణాలు చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ ఇచ్చింది. వివిధ తేదీల్లో ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసింది. సాంకేతిక కారణాలతో ఆయా రైళ్ల రాకపోకల్ని రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి తిరుపతి-అనకాపల్లి మధ్య రాకపోకలు సాగించే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
తిరుపతి నుంచి అనకాపల్లికి ప్రతీ ఆదివారం నడిచే రైలు నంబర్ 07481ను ఈ నెల 9, 11, 23, 30 తేదీల్లో రద్దు చేశారు. అలాగే అనకాపల్లి నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం వెళ్లే రైలు నంబర్ 07482ను కూడా ఈ నెల 10, 17, 24, డిసెంబర్ 1 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ సెక్షన్లో సాంకేతిక పరమైన కారణాల వల్ల ఈ రెండు రైళ్లను ఈ నెల 9 నుంచి డిసెంబర్ 1 వరకూ రద్దు చేసినట్లయింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాల్సి ఉంటుంది.

ఇప్పటికే అనకాపల్లి, తిరుపతి మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలోనూ ఈ రెండు స్టేషన్ల మధ్య పలు రైళ్లు రద్దవుతూ వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఈ మార్పులు తెలియక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరోసారి అనకాపల్లి, తిరుపతి స్టేషన్ల మధ్య నడిచే ఈ రెండు రైళ్లను రద్దు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే నెల నుంచి ఈ రైళ్లు యథావిథిగా రాకపోకలు సాగించనున్నాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications