కాకినాడ, నరసాపురం టూ కర్నాటక ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!
దక్షిణ మధ్య రైల్వే (south central railway) పరిధిలో పండుగల రద్దీ ముగిసినా ప్రయాణికుల రద్దీ మాత్రం కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే నడుపుతున్న పలు ప్రత్యేక రైళ్లకు మరికొంత కాలం పాటు పొడిగింపులు ఇస్తున్నారు. ఇదే క్రమంలో మన రాష్ట్రంలోని కాకినాడ, నరసాపురం నుంచి కర్నాటకలోని వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రతీ సోమవారం, శుక్రవారం కాకినాడ టౌన్ నుంచి మైసూరుకు నడుపుతున్న ప్రత్యేక రైలు (నంబర్ 070333)ను మార్చి 2 నుంచి మార్చి 30 వరకూ పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ లెక్కన 9 సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అలాగే మైసూరు నుంచి కాకినాడ టౌన్ కు ప్రతీ మంగళవారం, శనివారాల్లో నడుపుతున్నప్రత్యేక రైలు (నంబర్ 07034)ను మార్చి 3 నుంచి 31వ తేదీ వరకూ పొడిగించాలని నిర్ణయించింది. ఈ లెక్కన మరో 9 సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి.

అలాగే కాకినాడ-మైసూరు మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడే, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్, యలహంక, బెంగళూరు కాంట్, కెఎస్ఆర్ బెంగళూరు, కెంగేరి, మాండ్య స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
అలాగే నరసాపురం నుంచి ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్ కు ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు (నంబర్ 07153)ను మార్చి 6 నుంచి 27వ తేదీ వరకూ పొడిగించారు. ఈ లెక్కన మరో 4 సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఎస్ఎంవీటీ బెంగళూరు స్టేషన్ నుంచి నరసాపురానికి ప్రతీ శనివారం నడుపుతున్న ప్రత్యేక రైలు (నంబర్ 07154)ను మార్చి 7 నుంచి 28వ తేదీ వరకూ పొడిగించారు. ఈ లెక్కన మరో నాలుగు రైళ్లు అందుబాటులోకి వస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లకు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట, కృష్ణాపురం స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో AC II టైర్, AC III టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications