Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే అలర్ట్..! రేపు, ఎల్లుండి..!

ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లోని చర్లపల్లికి రాకపోకలు సాగించే వీకెండ్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (south central railway) ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఆదివారం, సోమవారం రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీకెండ్ లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వే విడుదల చేసింది.

ఇందులో విశాఖపట్నం నుంచి చర్లపల్లికి రేపు (ఆదివారం) సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు నంబర్ 08517 ఎల్లుండి(సోమవారం) ఉదయం 8.15కు గమ్యానికి చేరుతుంది. అలాగే చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి ఎల్లుండి (సోమవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు మరో ప్రత్యేక రైలు నంబర్ 08518 బయలుదేరి తర్వాత రోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు గమ్యానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

South Central Railway to Operate Two Special Trains Between Visakhapatnam and Charlapalli

ఈ రెండు ప్రత్యేక రైళ్లకూ దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే ఈ రెండు ప్రత్యేక రైళ్లలోనూ ధర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, జనరల్ సెకండ్ క్లాస్ బోగీల్ని అందుబాటులో ఉంచారు. కాబట్టి రిపబ్లిక్ డేకు ముందు విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రయాణాలు చేసే వారు ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+