విశాఖ-చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే అలర్ట్..! రేపు, ఎల్లుండి..!
ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లోని చర్లపల్లికి రాకపోకలు సాగించే వీకెండ్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (south central railway) ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు స్టేషన్ల మధ్య ఆదివారం, సోమవారం రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీకెండ్ లో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను రైల్వే విడుదల చేసింది.
ఇందులో విశాఖపట్నం నుంచి చర్లపల్లికి రేపు (ఆదివారం) సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు నంబర్ 08517 ఎల్లుండి(సోమవారం) ఉదయం 8.15కు గమ్యానికి చేరుతుంది. అలాగే చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి ఎల్లుండి (సోమవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు మరో ప్రత్యేక రైలు నంబర్ 08518 బయలుదేరి తర్వాత రోజు (మంగళవారం) ఉదయం 7 గంటలకు గమ్యానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకూ దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే ఈ రెండు ప్రత్యేక రైళ్లలోనూ ధర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, జనరల్ సెకండ్ క్లాస్ బోగీల్ని అందుబాటులో ఉంచారు. కాబట్టి రిపబ్లిక్ డేకు ముందు విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రయాణాలు చేసే వారు ఈ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు చెప్తున్నారు.
-
Viral Video: బాలయ్య డైలాగ్ చెప్పిన ఇరాన్ సైనికుడు..! తర్వాత మృత్యుఒడికి..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications