రుతుపవనాలు మరింత ఆలస్యం, మనకు అప్పుడే - మండుతున్న రాష్ట్రం..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. పలు ప్రాంతాలు ఎండ తీవ్రతకు ఉడికిపోతు న్నాయి. ఈ సారి రుతుపవనాలు ముందస్తుగానే అండమాన్ చేరుకున్నాయి. ఈ రోజు (26వ తేదీ) కేరళలో ప్రవేశిస్తాయని చెప్పుకొచ్చారు. దీంతో.. ఎండ తీవ్రత నుంచి త్వరలోనే బయట పడతామని భావించారు. అయితే.. రుతుపవనాలు మరింత ఆలస్యం అవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభం తేదీ పైన తాజాగా అప్డేట్ వచ్చింది.
నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. వడగాల్పుల ప్రభావం పెరిగితే ఇది మరింత ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణకు జూన్ రెండో వారం నాటికి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితు ల ప్రకారం ఈ నెల 31-జూన్ 2 మధ్య కేరళను తాకే అవకాశముందని వెల్లడించింది. అయితే, వడగాలుల ప్రభావం మరింత పెరిగితే రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావచ్చని పేర్కొంది. తెలంగాణకు జూన్ రెండోవారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.













Click it and Unblock the Notifications