వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కటి చెప్పండి: దిగ్విజయ్‌కి ఫోన్ చేసి నిలదీసిన కిరణ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Speak in one voice: CM to Digvijay
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఫోన్ చేసి ఢిల్లీ పెద్దల ప్రకటనలపై నిలదీసినట్లుగా తెలుస్తోంది. విభజన వంటి ప్రధాన అంశం పైన మీరు, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేలు వేర్వేరు ప్రకటనలు చేస్తున్నారని, ఇది సరికాదని డిగ్గీతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

మీరు, షిండేలు విభజనపై రెండు రకాలుగా మాట్లాడటం ఇరు ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని డిగ్గీని కిరణ్ ఆక్షేపించారు.

తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందని మీ మాటగా ఎపిఎన్జీవోలకు చెప్పాలని చర్చల సమయంలో నాతో చెప్పారని, అదే మాటను వారికి తాను చెప్పానని, ఇప్పుడు షిండే మాత్రం డ్రాఫ్ట్ బిల్లు మాత్రమే వస్తుందని విభజన తర్వాత పూర్తి చేస్తామని అంటున్నారని ఇదేమిటని డిగ్గీని ప్రశ్నించారు.

తీర్మానం రెండుసార్లు అసెంబ్లీకి వస్తుందని ఉద్యోగ సంఘాలకు నచ్చచెప్పిన సమయంలో విరుద్ధ ప్రకటనలు సరికాదని చెప్పారు. తీర్మానం పైన రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన డిగ్గీతో అభిప్రాయపడ్డారు. పార్టీ, ప్రభుత్వ ప్రకటనలు వేర్వేరుగా ఉండటం సరికాదని చెప్పారు. ఏది వాస్తవమో చెప్పాలని అడిగారు.

డిగ్గీ వివరణ

వేర్వేరు ప్రకటనలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను అడగడంతో దిగ్విజయ్ సింగ్ దానికి స్పందించారు. తాను ప్రస్తుతం మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నానని, ఢిల్లీకి వెళ్లాక షిండేతో మాట్లాడిన తర్వాత తాను చెబుతానని ముఖ్యమంత్రిని సముదాయించినట్లుగా తెలుస్తోంది.

English summary
CM N Kiran Kumar Reddy on Friday advised the AP state incharge Digvijay Singh to get its act together and speak in one voice over the procedure to be adopted to create the state of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X