కోడేల ఒక నోటోరియస్ రాజకీయవేత్త : సీ రామచంద్రయ్య
చరిత్ర లో స్పికర్ కొడేల శివ ప్రసాద్ లాంటీ రాజకీయ నోటోరియస్ వ్యక్తిని తాను చూడలేదన్నారు వైసీపి నేత సీ రామచంద్రయ్య .అసలు స్పికర్ కోడేల నర్సారావు పేట నుండి సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. నర్సారావు పేటలో ఓడిపోతాడని పార్టీ టికెట్ నిరాకరిస్తే, కాళ్లు వేళ్లు పట్టుకుని సత్తెనపల్లికి వచ్చాడని ఆయన విమర్శించారు.
అక్కడ కూడ కొద్ది మెజారిటితో గెలిచాడని అన్నారు. రాజకీయాల్లో ఇందిరా గాంధి, ఎన్టీఆర్ లాంటీ మహమహనాయకులే ఓడిపోయారని అన్నారు. ఇక అంబటి రాంబాబు తో నాకు పోలిక అంటున్న కోడేలది ఏమైన ఘనమైన చరిత్ర అని ప్రశ్నించారు. ఇతరుల చరిత్రను అడిగినప్పుడు తాన స్వంత చరిత్ర కూడ చూసుకోవాలని ఆయన సూచించారు. కోడేల హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రంగా ప్రాణభయం ఉందంటూ ,రక్షణ కల్పించాలని కోరితే , పట్టించుకోకుండ ఉన్నాడని ఆయన ఆరోపించారు.

కాగా రంగా మృతికి ముందు మూడు వందల మంది పోలీసులను ట్రాన్స్ఫర్ చేసిన ఘనత ఆయనది అన్నారు, ఈ సంఘటనతో ప్రభుత్వాన్నే ప్రజలు మార్చారని అన్నారు. ఇక కోడేల ఒక మంచి డాక్టరే కాని ఒక నెటోరియస్ వ్యక్తిత్వం కల్గిన రాజకీయనాయకుడని దుయ్యబట్టారు, ఆయన నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications