నేను మాట్లాడా, ఎమ్మెల్యేలపై వేటు వేయొచ్చు: జగన్కు స్పీకర్ వార్నింగ్!
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావొద్దని నిర్ణయించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు.
అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావొద్దని నిర్ణయించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
చదవండి: శ్రీవారిని దర్శించుకున్న జగన్: వందలమంది ఒకేసారి, చెప్పులతో, మళ్లీ వివాదం?

వైసిపి ఎమ్మెల్యేలతో మాట్లాడా
అసెంబ్లీకి రావొద్దని నిర్ణయించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో తాను మాట్లాడానని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తాము సమావేశాలకు రాలేమని వారు చెప్పారని కోడెల అన్నారు.

ఆశ్చర్యానికి గురి చేసింది
వైసిపి ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం తనను ఆశ్యర్యానికి గురి చేసిందని కోడెల అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఓటు వేసి పంపితే సభకు హాజరుకాకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. హాజరుకాకపోవడం అంటే ఓటు వేసిన ప్రజలకు అన్యాయం చేసినట్లే అన్నారు.

మూడు సెషన్లకు రాకుంటే వేటు వేసే అవకాశం
వరుసగా మూడు అసెంబ్లీ సెషన్లకు హాజరుకాకుంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం చట్టంలో ఉందని కోడెల చెప్పారు. గతంలో ఎన్టీఆర్, జయలలితలు సభకు హాజరుకాకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేలు హాజరయ్యారని చెప్పారు.

అనర్హత పిటిషన్ల పైన ఇలా
అనర్హత పిటిషన్లపై మాట్లాడుతూ... కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమిస్తుందని, అనర్హత పిటిషన్లపై సుప్రీం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications