శ్రీవారిని దర్శించుకున్న జగన్: వందలమంది ఒకేసారి రావడంతో, మళ్లీ వివాదం?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Recommended Video

తిరుపతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వైయస్తో పాటు పెద్ద ఎత్తున నాయకులు శ్రీవారి దర్శానానికి వచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

వందలమంది రావడంతో తనిఖీ చేయలేక
ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, వైసిపి నాయకులను తనిఖీ చేయకుండానే ఎస్పీఎఫ్ సిబ్బంది లోనికి పంపించినట్లుగా తెలుస్తోంది. అంతమంది ఒకేసారి గ్రూపుగా రావడంతో తనిఖీలు చేయలేకపోయారని తెలుస్తోంది. వందలాది మంది ఒకేసారి వస్తే ఎలా తనిఖీలు చేస్తామని ఎస్పీఎఫ్ సిబ్బంది అడిగారని తెలుస్తోంది.

క్యూ కాంప్లెక్స్ వరకు చెప్పులతో
జగన్ వెంట వచ్చిన వారిలో కొందరు క్యూ కాంప్లెక్స్ వరకు చెప్పులతో వచ్చారని వార్తలు వస్తున్నాయి. ఓ మహిళా నేత అక్కడి దాకా చెప్పులతో రాగా భద్రతా సిబ్బంది వారించారని, దీంతో ఆమె అక్కడే చెప్పులు వదిలేశారని అంటున్నారు.

గతంలోను వివాదం
వైయస్ జగన్ గతంలో తిరుమలకు వచ్చినప్పుడు కూడా వివాదం రాజుకుంది. అన్యమతస్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే డిక్లరేషన్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ అప్పుడు జగన్తో సంతకం చేయించుకోలేదనే వివాదం తెరపైకి వచ్చింది.

జగన్ వెంట నేతలు
కాగా, జగన్ అంతకుముందు శుక్రవారం రాత్రి పదింపావుకు రాధేయ అతిథి గృహానికి చేరుకున్నారు. రిసెప్షన్ సూపరింటెండెంట్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆయన వెంట విజయ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వరప్రసాద్, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రోజా తదితరులు ఉన్నారు.

పేరు మార్పుపై వివరణ
ప్రజా సంకల్ప యాత్ర కోసం జగన్ పేరు మార్చుకున్నారని ప్రచారం జరిగింది. దీనిని వైసిపి కొట్టి పారేసింది. జగన్ పేరు మార్చుకున్నారనే వార్తలను ఎవరూ నమ్మవద్దని చెప్పాయి. ఏదైనా ప్రత్యేక అంశం ఉంటే పత్రికా ప్రకటన ద్వారా అందరికీ తెలియజేస్తామన్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications