Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ రైలు ప్రారంభం-టైమింగ్స్, హాల్ట్ లివే..!
ఉత్తరాంధ్ర వాసులకు మరో శుభవార్త. శ్రీకాకుళం (Srikakulam) నుంచి తిరుపతి (tirupti)కి నేరుగా వెళ్లాలంటే విశాఖకు వెళ్లి, అక్కడి నుంచి మరో రైలు ఎక్కి వెళ్లాల్సిన పరిస్ధితుల్లో రైల్వేశాఖ ఇవాళ్టి నుంచి డైరెక్ట్ రైలు హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ (humsafar express) ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి మధ్య వారానికోసారి రాకపోకలు సాగించేలా రూపొందించిన ఈ రైలును ఇవాళ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు.
శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి మధ్య ప్రయాణించే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17440ను ఇవాళ ప్రారంభించారు. శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో ఇవాళ్టి నుంచి ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. అనంతరం చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ఇది తిరుపతికి మంగళవారం ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది.

ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి హమ్సఫర్ ఎక్స్ప్రెస్ (17439/40)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. 75 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా రెగ్యులర్ ట్రైన్ సేవ ప్రారంభం కావడం ద్వారా ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం… pic.twitter.com/tQwz3tajy3
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) April 13, 2026
మరోైవైపు తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు వెళ్లే హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17439 ఈనెల 19న ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రతీ ఆదివారం సాయంత్రం 4.55కు తిరుపతిలో బయలుదేరుతుంది. అక్కడి నుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్ల కోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి మీదుగా శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కు సోమవారం మధ్యాహ్నం 12.30కు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ ధర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్ లు మాత్రమే ఉంటాయి.












Click it and Unblock the Notifications