విక్టరీ: బ్యాలెన్స్ చేస్తూ బాబు గట్టెక్కారు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రాన్ని వరుసగా తుఫానులు అతలాకుతలం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం మండిపడ్డారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విభజన పైనా మాట్లాడారు.
అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరముందని స్పష్టంచేశారు. గతంలో అసెంబ్లీ తీర్మానాల ద్వారానే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, ఇక్కడ అసెంబ్లీని చులకన చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.
371(డి), 371(ఇ) ఆర్టికల్స్ ను సవరించాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ అవసరమన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే జాతీయ పార్టీలేవీ అంగీకరించవని, తాము కూడా ఒప్పుకోబోమని తెలిపారు.

బాబు 1
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండను ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా, రాజకీయ ప్రచార కార్యక్రమంగా ఉపయోగించుకుంటున్నారని బాబు విమర్శించారు.

బాబు 2
రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరొకటిలా ఉందన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా ముందు మాట్లాడలేకపోతున్నారని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బాబు 3
ఢిల్లీ పెద్దల వద్ద కాంగ్రెస్ నాయకులు వంగి దండాలు పెడుతున్నారే తప్ప ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర హీనురాలై పోతుందన్నారు.

బాబు 4
తనపై కేసుల మాఫీ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బాబు 5
సోనియా గాంధీ ముందు రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతూ.. ఇక్కడ సమైక్యాంధ్ర జపం చేస్తూ ఆంద్రులను మోసగిస్తున్నారని విమర్శించారు.

బాబు 6
సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణాలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల ద్వారా రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందన్నారు.

బాబు 7
కాంగ్రెసు పార్టీ కుట్రలు, కుయుక్తులను జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.

బాబు 8
ఇరు ప్రాంత ప్రజలను ఒప్పించడం ద్వారా మాత్రమే విభజన సాధ్యమన్నారు. తెరాస, జగన్ పార్టీలతో సోనియా చేతులు కలిపి తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తుండటాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు.

బాబు 9
సమన్యాయం చేయకుంటే తాము విభజనను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు.

బాబు 10
చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా కొత్తకోట మండలంలో తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

బాబు 11
రాష్ట్రంపై వరుసగా విపత్తులు దాడి చేస్తున్నప్పటికీ సాయం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కిరణ్కు తుఫాను బాధితుల సమస్యలకన్నా రచ్చబండే ఎక్కువయిందన్నారు.

బాబు 12
విభజనపై కేంద్రం నిర్ణయాలతో సీమాంధ్రులు భయాందోళనకు గురవుతున్నారని, సమన్యాయం చేయకుంటే విభజనను అడ్డుకుంటామన్నారు.

బాబు 13
రాష్ట్రాన్ని వరుసగా తుఫానులు అతలాకుతలం చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాధితులను ఆదుకోవడం లేదని నారా చంద్రబాబు నాయుడు సోమవారం మండిపడ్డారు.

బాబు 14
చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో హెలెన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విభజన అంశం పైనా మాట్లాడారు.

బాబు 15
అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. విభజనపై కేంద్రం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

బాబు 16
అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరముందని స్పష్టంచేశారు. గతంలో అసెంబ్లీ తీర్మానాల ద్వారానే మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, ఇక్కడ అసెంబ్లీని చులకన చేస్తే ప్రజలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు.

బాబు 17
371(డి), 371(ఇ) ఆర్టికల్స్ ను సవరించాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ అవసరమన్నారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే జాతీయ పార్టీలేవీ అంగీకరించవని, తాము కూడా ఒప్పుకోబోమని తెలిపారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications