బస్తా మోశారు, మహిళల 'కొండం'త అండ (పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమని అడుగుతున్నారు.
ప్రచార పర్వంలో భాగంగా సరదాకో లేక సంతోషానికో ఓటర్ల మనసులు గెలుచుకునేందుకో కానీ అభ్యర్థులు చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు.
కొందరు అభ్యర్థులు ఖైమా కొట్టగా, మరికొందరు దోశలు పోశారు. ఇంకొందరు దుకాణాల్లో వస్తువులను తూచారు. తాపీ మేస్త్రీగా మారిన వారు కూడా ఉన్నారు.
తెలుగుదేశం
మల్కాజిగిరి తెలుగుదేశం లోకసభ అభ్యర్థి మల్లారెడ్డి తన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన బైక్ పైన కూడా ఎక్కి ఆకట్టుకున్నారు.
తెలుగుదేశం
మల్కాజిగిరి తెలుగుదేశం లోకసభ అభ్యర్థి మల్లారెడ్డి తన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన బైక్ పైన కూడా ఎక్కి ఆకట్టుకున్నారు.
తెరాస
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బస్తాలు మోస్తూ ప్రచారం చేస్తున్న దృశ్యం.
దత్తాత్రేయ, తలసాని
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సికింద్రాబాదు లోకసభ పరిధిలోని సనత్ నగర్ అసెంబ్లీ నియోకవర్గంలో ప్రచారంలో బిజెపి నేత దత్తాత్రేయ, టిడిపి నేత తలసాని.
తెరాస
చేవెళ్ల తెరాస అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున మదీనాగూడలో ప్రచారం చేస్తున్న శోభన కామినేని, సంగీతా రెడ్డి తదితరుల దృశ్యం.
తెరాస
చేవెళ్ల తెరాస అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున మదీనాగూడలో ప్రచారం చేస్తున్న శోభన కామినేని, సంగీతా రెడ్డి తదితరుల దృశ్యం. వీరు మైహోం జెవెల్స్ కమ్యూనిటీ హాలులో సమావేశం నిర్వహించి మాట్లాడారు.