నిర్మలమ్మ బడ్జెట్పై సాదినేని యామిని రియాక్షన్ ఇదీ: ఆ రంగానికి మేలు చేసేలా: ఏపీ బీజేపీ నేత
అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొద్దిసేపటి కిందటే లోక్సభలో ప్రవేశపెట్టిన 2021-2022 బడ్జెట్ ప్రతిపాదనలపై బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు స్పందించారు. ఈ సారి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు.. దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రేయస్సు కోసం తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతులకు కనీస మద్దతు ధరను కల్పించడానికి ఉద్దేశించిన చర్యలు.. ఈ బడ్జెట్లో ప్రస్ఫూటించాయని పేర్కొన్నారు.
రైతన్నలకు మేలు కలిగించే అనేక రకాల ప్రయోజనాలను బడ్జెటలో ప్రవేశపెట్టడం హర్షణీయమని ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, సాదినేని యామిని అన్నారు. కనీస మద్దతు ధర కంటే 1.5 శాతానికి మించి అధిక ప్రయోజనాలను కల్పించేలా బడ్జెట్కు రూపకల్పన చేశారని చెప్పారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి, వారికి మరిన్ని ప్రయోజనాలను కల్పించడానికి పట్ల బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ వెనుకాడబోదని అన్నారు.

2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గోధుమలకు 33,874 కోట్ల రూపాయల మద్దతుధరను ఇస్తే ఎనిమిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మొత్తాన్ని 75,060 కోట్లకు పెంచి, ఇచ్చిందని అన్నారు. 2013: వరికి 63 వేల కోట్లు చెల్లిస్తే.. మోడీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రెట్టింపు చేసిందని చెప్పారు. 1,72,000వేల కోట్లను ఇచ్చిందని వివరించారు. చిరుధాన్యాలు 2013 లో 236 కోట్లు, 2020లో 10,530 కోట్లను ఇచ్చారని అన్నారు.
పత్తికి 2013లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది 90 కోట్లేనని, తమ ప్రభుత్వం ఈ మొత్తాన్ని 25 975 కోట్లకు పెంచిందని చెప్పారు. .వ్యవసాయ రుణాలను 16.5 లక్షల కోట్లుగా నిర్దేశించుకోవడం గొప్ప విషయమని అన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి 1100 కోట్లను అధికంగా కేటాయించారని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగానికి 2.23 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం హర్షణీయమని వారు వ్యాఖ్యానించారు. రక్షణ రంగానికి 4.77 లక్షల కోట్ల రూపాయలను మంజూరు చేయడం చరిత్రలో లేదని అన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications