వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబు స్మార్ట్ విలేజ్కి సహకారం: జగన్పార్టీ ఎంపీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) అమలుకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన స్మార్ట్ విలేజ్ వార్డుకు వ్యాపారవేత్త్తలు, ఆర్థిక స్థితి మంతులు తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రంలో మంగళవారం ఆదర్శ గ్రామ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కేంద్రం పార్లమెంట్ సభ్యులకు ఏటా 5కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయిస్తారన్నారు. ఎన్నికల అనంతరం ఈ ఏడాది కేటాయించిన ఎంపీ నిధులను పూర్తిగా తాగునీటి అవసరాలు, గ్రామాభివృద్ధికే ఖర్చు చేశామన్నారు.
Comments
mekapati rajamohan reddy narendra modi chandrababu naidu switzerland davos andhra pradesh మేకపాటి రాజమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ దావోస్ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ
English summary
Support smart cities for AP, says MP Mekapati Rajamohan Reddy.
Story first published: Wednesday, January 21, 2015, 14:20 [IST]