రఘురామ కూడా సస్పెండ్ ? సుప్రీం తీర్పుతో పీవీ సునీల్ షాకింగ్ ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ రాజద్రోహం కేసులో అరెస్టు అయిన తర్వాత సీఐడీ కస్టడీలో హింసకు గురైన ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేసు రోజుకో ములుపు తిరుగుతోంది. రఘురామపై గతంలో దాడి చేసిన వ్యవహారంలో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కూటమి సర్కార్ తాజాగా ఇందుకు బాధ్యుడైన అప్పటి సీఐడీ ఛీఫ్, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న పీవీ సునీల్ కుమార్ ను విచారణకు పిలిపించింది. ఈ విచారణకు హాజరైన పీవీ సునీల్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చర్చనీయాంశమవుతోంది.
రఘురామకృష్ణంరాజుపై కస్టడీ దాడి కేసులో తనను పోలీసులు విచారణకు పిలిపించడానికి ముందే సస్పెండ్ చేసిన వ్యవహారంపై ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో స్పందించారు. ఈ మేరకు సంచలన పోస్ట్ పెట్టారు. "దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే . మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి" అని పీవీ సునీల్ పోస్టు పెట్టారు.

అయితే ఇక్కడ పీవీ సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది అనుమతి లేకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించారని. అయితే తాజాగా రఘురామరాజు ఇండ్ భారత్ సంస్ధ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసిన విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే విచారణకు మాత్రం నోటీసులు ఇచ్చి పిలవలేదు.

దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే . మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి pic.twitter.com/qLM6rW3vTk
— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) December 17, 2025
అదే సమయంలో సీబీఐ దర్యాప్తు కొనసాగింపుపై కోర్టు స్టే ఇచ్చింది. దాన్ని తాజాగా ఎత్తేసింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నోటీసులు ఇవ్వలేదనే కారణంతో కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు తేల్చేచెప్పేసింది. దీంతో సీబీఐ ఈ కేసులో దర్యాప్తు కొనసాగించడానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి రఘురామరాజును తప్పించాలంటూ పీవీ సునీల్ ఈ పోస్టు ద్వారా ప్రభుత్వాన్ని పరోక్షంగా కోరారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications