జాగ్రత్తగా చూస్తాం: శ్వేతాబసు తల్లి, వెళ్లేందుకు సిద్ధం!
హైదరాబాద్: తన కూతురును అప్పగించాలని టాలీవుడ్ నటి శ్వేతాబసు తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక నుంచి తమ కుమార్తెను జాగ్రత్తగా చూసుకుంటామని, ఆమెను వెన్నంటి ఉంటానని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో జడ్జి శ్వేతబసును కూడా విచారించారు.
అమె తల్లితో వెళ్లేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. రెస్క్యూ హోం నుండి శ్వేతాబసును పంపించాలంటే నిర్వాహకులు ఆమె కుటుంబ పరిస్థితి పైన న్యాయస్థానానికి నివేదిక సమర్పించవలసి ఉంటుంది. అనంతరం బాధితురాలు, పోలీసుల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
కాగా, వ్యభిచారం కేసులో శ్వేతాబసు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆమెను మూడు నెలల పాటు రెస్క్యూ హోంలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆమెను రెస్క్యూ హోంకు తరలించారు. తల్లి తమ బిడ్డను అప్పగించాలని కోరడంతో శ్వేతాబసు రికార్డును కూడా న్యాయస్థానం రికార్డు చేసింది.
కాగా, టీవీ నటి, తెరపై శ్వేతబసుకు తల్లిగా నటించిన సాక్షి తన్వార్.. వ్యభిచారం కేసులో శ్వేతబసు అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే తన భావాలను మీడియాతో పంచుకున్నారు. రెస్క్యూ హోంలో ఉంటున్న శ్వేతబసును కలిసేందుకు ఆమె కన్నతల్లిని అనుమతించడం లేదని సాక్షి తన్వార్ అన్నారు.