జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు మార్గంలో ప్రయాణించండి
భారతీయ రైల్వే అంటేనే అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక. నెట్ వర్క్ పరంగా ప్రపంచంలో నాలుగో స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతిరోజు 13వేల రైళ్లద్వారా కోటిమంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. సెలవులు, పండగల సమయంలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రతిఒక్కరికి రైలులో ప్రయాణించడం అంటే ఎంతో సరదాగా ఉంటుంది. ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కిటికీ పక్కన కూర్చొని ప్రకృతి సోయగాలను తిలకిస్తూ, పచ్చని పంటపొలాలను చూస్తూ మురిసిపోతారు. పదే పదే రైలులోనే ప్రయాణం చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.
వాస్కోడగామా నుంచి లోండా వరకు
కొండలను తొలిచి సొరంగాలను ఏర్పాటు చేసి, జలపాతాలు పైనుంచి రైలు మీద పడుతుండగా కూడా రైళ్లు ప్రయాణిస్తూనే ఉంటాయి. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన మార్గాల్లో కూడా రైలు ప్రయాణం సాగుతుంటుంది. వాస్కోడగామా నుంచి లోండా వరకు సాగే ప్రయాణంలో గోవాతోపాటు పశ్చిమ కనుమల గుండా ప్రయాణం సాగుతుంది. పచ్చదనాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు.

ముంబయి టు గోవా
ఈ మార్గంలో సహ్యాద్రి పర్వతాలు, అరేబియా సముద్రం గుండా ప్రయాణం సాగుతుంటుంది. అద్భుతమైన ఈ మార్గంలో 200 రైల్వే వంతెనలతోపాటు 92 సొరంగ మార్గాలున్నాయి. ప్రయాణికులకు అద్బుతమైన అనుభూతిని పంచుతుంది.
డార్జిలింగ్ హిమాలయన్ సర్వే
జల్పాయ్ గురి నుంచి డార్జిలింగ్ వరకు.. ఈ మీటర్ గేజ్ రైలు మార్గంలో పచ్చని తేయాకు తోటలతోపాటు హిమాలయాల అందాలను ఆస్వాదించొచ్చు.
హిమాలయన్ క్వీన్ కల్కా నుంచి సిమ్లా వరకు
102 సొరంగాలు, 82 వంతెనల గుండా ప్రయాణం సాగుతుంటుంది. 96 కిలోమీటర్లు సాగే ట్రాయ్ ట్రైన్ జర్నీ కొత్త అనుభూతిని పంచుతుంది.
కన్యాకుమారి నుంచి త్రివేండ్రం వరకు
కొబ్బరితోటలు, కొండల మధ్య గుండా ప్రయాణం సాగుతుంటుంది. ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కల్పిస్తుంది.












Click it and Unblock the Notifications