ఫలించిన కేశినేని శ్రమ: బెజవాడ ఎంపీ సీట్లో టాటా గ్రూప్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 264 గ్రామాలకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలను టాటా ట్రస్టు రూపొందించింది.
ఈ నెల 23న సాయంత్రం విజయవాడకు టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా రానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో విజయవాడ అభివృద్ధికి సంబంధించి రతన్ టాటా సమావేశమవుతారు.

ఈ నెల 24న గ్రామాల అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా ఆవిష్కరిస్తారు. దేశంలోనే తొలిసారిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టాటా ట్రస్టు దత్తత తీసుకుంది.
దేశంలో పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్న టాటా గ్రూప్ విజయవాడపై ప్రత్యేక దృష్టి సారించడంతో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయని భావిస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications