రాయదుర్గం టిడిపి ఆఫీసులో వీరంగం: విశాఖలో ధర్నా

 TDP activists attack party office at Rayadurgam
అనంతపురం/ విశాఖపట్నం: అనంతపురం జిల్లాలోని రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు శనివారం వీరంగం సృష్టించారు. రాయదుర్గం శాసనసభా స్థానాన్ని దీపక్‌రెడ్డికి కేటాయించాలంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాడిలో కుర్చీలు విరిగిపోయాయి. వాటిని నేలకేసి కొట్టారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

ఓ కార్యకర్త వాటర్‌ట్యాంక్‌పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. దీపక్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపునకు యత్నించారు. కాల్వ శ్రీనివాసులుకు రాయదుర్గం టికెట్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశాఖపట్నం లోకసభ స్థానాన్ని మహిళలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. వారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా నినాదాలు చేస్తూనే మహిళలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విశాఖపట్నం లోకసభ స్థానాన్ని కాంగ్రెసు నుంచి పార్టీలోకి వచ్చిన గంటా శ్రీనివాస రావుకు కేటాయిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+