వైసీపీ, టీడీపీ కంచుకోటల్లో వీరిని ఢీకొట్టేవారే లేరా??
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ నియోజకవర్గాల్లోని ప్రజలకు ప్రభుత్వాలతో సంబంధం ఉండదు. తాము మొదటి నుంచి ఏ పార్టీని ఇష్టపడ్డామో వాటికే మద్దుతు తెలియజేస్తారు. సంవత్సరాలు కావచ్చు.. దశాబ్దాలు కావచ్చు.. కానీ అక్కడ ఒక పార్టీనే గెలుస్తూ వస్తుంటుంది. అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందా? తెలుగుదేశం ఉందా? అనేది వారికి అనవసరం. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా అక్కడ ఓటర్ల మద్దతు మాత్రం వారికి నచ్చిన పార్టీకే ఓటు వేస్తుంటారు.
జగన్ వేవ్ ను తట్టుకున్న టీడీపీ కోటలు
వైఎస్సార్
కాంగ్రెస్
పార్టీకి,
తెలుగుదేశం
పార్టీకి
రాష్ట్రంలో
తమకంటూ
ప్రత్యేకంగా
కొన్ని
నియోజకవర్గాలున్నాయి.
పార్టీ
ఏర్పాటైనప్పటినుంచి
ఆయా
పార్టీలకే
కొమ్ము
కాస్తుంటాయి.
దీంతో
వాటిని
కంచుకోటలుగా
పిలవడం
ప్రారంభించారు.
ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్గా
ఉన్నప్పుడుకానీ,
రాష్ట్ర
విభజన
తర్వాత
2014,
2019
ఎన్నికల్లోకానీ
ఆయా
నియోజకవర్గాల్లోని
ఓటర్లను
ప్రభుత్వాలు
ప్రభావితం
చేయలేకపోయాయి.
పార్టీలే
ప్రభావితం
చేశాయి.
2019లో
ఏపీని
ఊపేసిన
జగన్
గాలిలో
కూడా
తెలుగుదేశం
పార్టీ
కొన్ని
కంచుకోటలను
కాపాడుకోగలిగింది.
కుప్పం,
హిందూపురం,
విజయవాడ
తూర్పు,
ఉండి,
పాలకొల్లు,
రాజమండ్రి
సిటీ,
రూరల్,
అద్దంకి,
పర్చూరు,
విశాఖ
తూర్పు,
టెక్కలి,
ఇచ్చాపురం
స్థానాల్లో
తెలుగుదేశం
పార్టీని
ఓడించడం
కష్టమనే
అభిప్రాయం
వ్యక్తమవుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటలు
వైసీపీకి
పులివెందుల,
కడప,
రాయచోటి,
జమ్మలమడుగు,
బద్వేలు,
శ్రీశైలం,
డోన్,
పాణ్యం,
పుంగనూరు,
నెల్లూరు
రూరల్,
ఆత్మకూరు,
చంద్రగిరి,
మాచర్ల,
గుడివాడ
లాంటి
కంచుకోటలున్నాయి.
1983లో
టీడీపీ
ఆవిర్భవించినప్పటి
నుంచి
ఉన్న
కొన్ని
కంచుకోటలను
జగన్
వేవ్లో
కోల్పోయింది.
వాటిల్లో
తిరిగి
పుంజుకుంటున్నామని
ఇటీవలి
సమావేశంలో
చంద్రబాబు
పార్టీ
నేతలకు
వెల్లడించినట్లు
తెలిసింది.
అలాంటి
వాటిల్లో
పొన్నూరు,
మైలవరం,
దెందులూరు,
పెనమలూరుతోపాటు
మరికొన్ని
నియోజకవర్గాల
పేర్లు
చెప్పినట్లు
సమాచారం.
విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు
2014
ఎన్నికల్లో
ఉన్న
పరిస్థితి
2019కి
వచ్చేసరికి
మొత్తం
మారిపోయింది.
దీన్ని
విశ్లేషకులు
సైతం
అంచనా
వేయలేకపోయారు.
2004
ఎన్నికలను
కూడా
తట్టుకొని
నిలబడ్డ
కొన్ని
టీడీపీ
నియోజకవర్గాలు
2019
ఎన్నికల్లో
మాత్రం
బోల్తా
పడ్డాయి.
రానున్న
ఎన్నికల్లో
అధికారంలో
ఉన్న
వైసీపీ
టీడీపీ
కంచుకోటలను
బద్దలు
కొట్టడమే
లక్ష్యంగా
ప్రణాళికలు
రచించుకుంటోంది.
మరోవైపు
టీడీపీ
కూడా
వైసీపీకి
పట్టున్న
నియోజకవర్గాలపై
కసరత్తులు
చేస్తోంది.
ఈసారి
ఎన్నికల్లో
ఎవరి
కంచుకోటలను
ఎవరు
బద్ధలు
కొడతారో?
ఎవరి
కంచుకోటలను
ఎవరు
కాపాడుకుంటారో
తెలియాలంటే
ఎన్నికలు
జరిగి,
వాటి
ఫలితాలు
వచ్చేంతవరకు
ఎదురు
చూడక
తప్పదు
మరి.!!