కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపితో పొత్తుపై నిర్ణయం అధిష్గానానిదే: విష్ణుకుమార్రాజు
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పొత్తు విషయమై టిడిపి, బిజెపి నాయకత్వాలు కలిసి నిర్ణయం తీసుకొంటాయని బిజెపి శాసనసభపక్షనాయకుడు విష్ణుకుమార్రాజు చెప్పారు. 2019 వరకు టిడిపి, బిజెపిలు మిత్రపక్షాలేనని ఆయన
కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పొత్తు విషయమై టిడిపి, బిజెపి నాయకత్వాలు కలిసి నిర్ణయం తీసుకొంటాయని బిజెపి శాసనసభపక్షనాయకుడు విష్ణుకుమార్రాజు చెప్పారు. 2019 వరకు టిడిపి, బిజెపిలు మిత్రపక్షాలేనని ఆయన గుర్తుచేశారు.
సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో వైసీపీ నిర్వహించిన బహిరంగసభలో వైసీపీ చీఫ్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్యలను విష్ణుకుమార్రాజు ఖండించారు.
నంద్యాల సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .
ఈ వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయన క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. 2019 నాటికి టిడిపి, బిజెపిలు మిత్రపక్షాలుగా కొనసాగుతాయనే విషయాన్ని ఆయన మీడియాకు గుర్తుచేశారు.
2019లో జరిగే ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకొంటోందని ఆయన చెప్పారు.