Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కీలక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి ఖరారు - అక్కడే అసలు ట్విస్ట్..!!

రాజధాని జిల్లాలో కీలక నియోకవర్గం నుంచి టీడీపీ అభ్యర్దిని ఖరారు చేసింది.

వైసీపీ వర్సస్ టీడీపీ. వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కీలక నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఖరారు చేస్తున్నాయి. కొన్ని చోట్ల అధికారికంగా ప్రకటన చేస్తుంటే..మరి కొన్ని నియోజకవర్గాల్లో వేచి చూసే ధోరణితో ఉన్నాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు చేసారు. వైసీపీ కూడా ఇప్పటి వరకు కొన్ని మినహా టీడీపీ సిట్టింగ్ లు ఉన్నచోట అభ్యర్దులను ఫైనల్ చేస్తోంది. టీడీపీ -జనసేన పొత్తు పైన అధికారికంగా నిర్ణయం తరువాత అన్ని నియోజకవర్గాల పైనా క్లారిటీ రానుంది.అదే క్రమంలో ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నసత్తెనపల్లి నుంచి టీడీపీ అభ్యర్ధి ఖరారయ్యారు. అయితే, అక్కడ కొత్త పొలిటికల్ గేమ్ మొదలైంది. సీఎం జగన్ నిర్ణయం కీలకం కానుంది.

అంబటి పై టీడీపీ - జనసేన ఫోకస్

అంబటి పై టీడీపీ - జనసేన ఫోకస్


వైసీపీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కొంత కాలంగా టీడీపీ -జనసేనకు టార్గెట్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో అంబటిని ఓడించాలనేది ఈ రెండు పార్టీల లక్ష్యం. జనసేనాని వర్సస్ అంబటి రాంబాబు పలు సందర్భాల్లో మాటల తూటాలు పేలాయి. పవన్ ను అంబటి టార్గెట్ చేస్తే ఆరోపణలు గుప్పించారు. అంబటి పైన పవన్ కల్యాణ్ అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి తిరిగి మంత్రి అంబటి పోటీ చేస్తారా లేదా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ సారి అక్కడ నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పోటీకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారంసాగుతోంది. ఇదే క్రమంలో సత్తెనపల్లి సీటు కోసం టీడీపీ నుంచి పోటీ నెలకొని ఉంది. జనసేన నుంచి గుంటూరు జిల్లాలో కీలక బాధ్యతలు చూస్తున్న నేత ఆ సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ -జనసేన కలిసి పోటీ చేస్తే అక్కడ గెలుపు ఖాయమనే లెక్కల్లో ఇరు పార్టీల నేతలు ఉన్నారు. కానీ, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సత్తెనపల్లి సీటు నుంచి టీడీపీ అభ్యర్ధి ఖరారు అయ్యారు. జనసేనానితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న నేత కావటంతో ఆయనకే సీటు ఫైనల్ కానుందని సమాచారం.

టీడీపీలోకి కన్నా - సత్తెనపల్లి నుంచి పోటీ

టీడీపీలోకి కన్నా - సత్తెనపల్లి నుంచి పోటీ

బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కన్నా ఈ నెల 23న టీడీపీలో చేరటం ఖాయమైంది. ఆయన సత్తెనపల్లి నుంచి ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం. గుంటూరు పశ్చిమం పైన ప్రచారం సాగుతున్నా.. జనసేనతో పొత్తు ఖాయమైతే సీట్ల సర్దుబాటు..టీడీపీ సీనియర్లకు ప్రాధాన్యతలో భాగంగా ముందస్తుగానే కన్నాకు సత్తెనపల్లి ఖరారు చేసినట్లు చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గతంలో పెదకూరపాడు నుంచి నాలుగు సార్లు..గుంటూరు పశ్చిమం నుంచి ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రెండు మండలాల్లో కన్నాకు పట్టు ఉంది. టీడీపీ ఓట్ బ్యాంక్ తో పాటుగా కన్నా ఎంట్రీ కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇప్పుడు కన్నా బరిలోకి దిగనుండటంతో..వైసీపీ నుంచి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి అంబటి తిరిగి పోటీ చేస్తారా.. ప్రచారం సాగుతున్నట్లుగా ఆర్కే లేక మరొకరు బరిలోకి దిగుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
సామాజిక సమీకరణాలే కీలకం..

సామాజిక సమీకరణాలే కీలకం..


సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా సామాజిక సమీకరణాలే ప్రభావితం చేస్తాయి. బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే కన్నా సత్తెనపల్లిలో ప్రత్యక్షమయ్యారు. 2019 ఎన్నికల్లో కోడెల శివ ప్రసాదరావు పైన అంబటి రాంబాబు 21 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ, ఇప్పుడు టీడీపీలో వర్గ పోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో కన్నా టీడీపీ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్దం అవుతోంది. ఇటు కన్నాకు మద్దతుగా నిలిచే కీలక వ్యక్తులతో అంబటి టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. కన్నా కు సీటు ఖరారు మూడు నియోజకవర్గాలతో లింకు అయి ఉంది. అదే సమయంలో జనసేనతో పొత్తు కీలకంగా మారనుంది. దీంతో..ఇప్పుడు చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా సత్తెనపల్లి నుంచి కన్నా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+