విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ కార్పొరేటర్ల పక్క చూపులు .. రెండు నెలల్లో విశాఖలో టీడీపీ ఖాళీ వ్యాఖ్యల మతలబు అదేనా !!

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నంలో కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత అసలు రాజకీయం మొదలైంది. విశాఖ పై పట్టు కొనసాగించడానికి వైసిపి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టిడిపి కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్యే ని కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖలో రెండు నెలల్లో టిడిపి లేకుండా చేస్తామని వైసీపీ కీలక నేత ప్రకటించడం వెనుక టిడిపిని ఖాళీ చేయాలనే ఆలోచన ఉందన్న చర్చ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

 విచారణ ఎదుర్కోలేని చవట ,దద్దమ్మ చంద్రబాబు .. ఆయన స్టేల బాబు : కొడాలి నాని ఫైర్ విచారణ ఎదుర్కోలేని చవట ,దద్దమ్మ చంద్రబాబు .. ఆయన స్టేల బాబు : కొడాలి నాని ఫైర్

 గ్రేటర్ విశాఖలో ఎన్నికల తర్వాత మారుతున్న రాజకీయం

గ్రేటర్ విశాఖలో ఎన్నికల తర్వాత మారుతున్న రాజకీయం

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. ఎంపీ విజయసాయిరెడ్డి గ్రేటర్ విశాఖలో వైసీపీ జెండా ఎగరవేయడానికి సాయశక్తులా కృషి చేశారు. ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కన్న బాబు తదితరులు కూడా ఎన్నికల పై ఫోకస్ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. గ్రేటర్ విశాఖలో అధికార వైసిపి కల నెరవేరింది .

 టీడీపీ మరో రెండు నెలల్లో విశాఖలో లేకుండా చేస్తామన్న ఎంపీ సాయి రెడ్డి

టీడీపీ మరో రెండు నెలల్లో విశాఖలో లేకుండా చేస్తామన్న ఎంపీ సాయి రెడ్డి

98 డివిజన్లు కలిగిన కార్పొరేషన్లో వైసిపి 58 డివిజన్ లను గెలుచుకున్నప్పటికీ పాలకమండలిలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బలంగా ఉండటం ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. అందుకే గ్రేటర్ విశాఖలో కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చాయి . ఈ క్రమంలోని ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయని , 2024లో తెలుగుదేశం పార్టీ అనేది ఉండదని , మరో రెండు నెలల కాలంలో జీవీఎంసీ లో టిడిపి లేకుండా చేస్తామని వ్యాఖ్యలు చేశారు.

 గాజువాక వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన టీడీపీ కార్పొరేటర్లు .. చంద్రబాబుకు షాక్ ,

గాజువాక వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన టీడీపీ కార్పొరేటర్లు .. చంద్రబాబుకు షాక్ ,


ఆయన వ్యాఖ్యానించిన 24 గంటల లోపే పొలిటికల్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి . గాజువాక అసెంబ్లీ పరిధిలో టీడీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలవటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్యేను కలవడానికి కారణం చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేయగా, అధికార వైసీపీ మాత్రం తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసే వ్యూహంతో ముందుకు వెళుతుందని తాజా పరిణామాలతో అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తో భేటీ పై టిడిపి కార్పొరేటర్లు వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తో భేటీ పై టిడిపి కార్పొరేటర్లు వివరణ ఇచ్చారు.


షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చిన కార్పొరేటర్లు .. అయినా అనుమానమే !!

తాము అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే నాగిరెడ్డిని కోరామని, అందుకోసమే ఆయనను కలిశామని టిడిపి కార్పొరేటర్లు చెబుతున్నారు. అంతకుమించి తమకు వేరే ఆలోచన ఏదీ లేదన్నారు.ఎమ్మెల్యే నాగిరెడ్డి భేటి పై దుష్ప్రచారం చేస్తున్నారని వారంటున్నారు . ఏది ఏమైనా టిడిపి కార్పొరేటర్ల వైసీపీ ఎమ్మెల్యే ని కలవడం, రెండు నెలల్లో విశాఖలో టిడిపి లేకుండా చేస్తామని విజయ సాయి రెడ్డి పేర్కొనడం వెనుక వైసిపి ఆపరేషన్ ఆకర్ష్ ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది.
అందులో భాగంగానే టీడీపీ కార్పొరేటర్లు కొందరు పక్క చూపులు చూస్తున్నారని సమాచారం .

English summary
The YCP has been trying to maintain its grip on Visakhapatnam. The latest in a series of TDP corporators meeting with a YCP MLA has gained political prominence. The idea of ​​vacating the TDP behind the announcement by a key YCP leader that it would do away with the TDP in two months in Visakhapatnam has become a hot topic locally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X