తిరుమల వెంకన్న సాక్షిగా టిడిపి ధర్మ పోరాట దీక్ష...ఎన్నికల శంఖారావమా?
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానంటూ నరేంద్ర మోడీ మోసం చేశారంటూ టిడిపి తిరుపతి వేదికగా సోమవారం ధర్మదీక్ష నిర్వహిస్తోంది. గత ఎన్నికల సమయంలో తిరుమల వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చి వంచన చేసిన నరేంద్ర మోదీ, బీజేపీలపై తమ పోరాటాన్ని టీడీపీ మరింత ఉధృతం చేసింది.
Recommended Video

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన నరేంద్రమోడీ 2014 ఏప్రిల్ 30వ తేదీన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని తారకరామా స్టేడియంలో మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మోడీ ప్రధాని అయ్యాక వాటిని నెరవేర్చకుండా మోసగించారని టిడిపి కేంద్రంతో తెలగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ఇదే ఏప్రిల్ 30న అదే వేదిక నుంచి ప్రజలకు తెలియజెప్పే విధంగా టిడిపి భారీ స్థాయిలో ధర్మపోరాట బహిరంగ సభ నిర్వహిస్తోంది.

ధర్మపోరాట దీక్ష...నినాదం ఇదే
"నమ్మక ద్రోహం-కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం" అనే నినాదంతో టిడిపి తిరుపతి వేదికగా ధర్మదీక్ష సభను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం మోసంపై గళమెత్తనున్నారు. ఈ సభకు రాష్ట్రంలోని టిడిపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ, ఇతర ముఖ్య నేతలందరూ హాజరుకానున్నారు. మొత్తం మీద సుమారు లక్షన్నర వరకు జనం ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

టిడిపి...ఎన్నికల ప్రచారానికి నాంది
కేంద్ర ప్రభుత్వంపై తెదేపా చేస్తున్న రాజీలేని పోరాటాన్ని ప్రజలకు తెలియజేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా పక్కన పెట్టారన్నది ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టిడిపి ముఖ్య నేతలు వివరించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటం, తిరుపతి నుంచే తెదేపా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే సంప్రదాయం కలిగి ఉండటాన్ని బట్టి ఇది టిడిపి ఎన్నికల ప్రచారానికి నాందిగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

చంద్రబాబు...తొలిసారి బహిరంగ సభ
గడచిన నాలుగేళ్లుగా ప్రభుత్వపరంగా నిర్వహిస్తున్న సభల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటూ వచ్చే తప్ప ఏ సభ ను బహిరంగ సభగా టిడిపి పేర్కొనలేదు. అలాగే గతంలో నవ నిర్మాణ దీక్ష, అలాగే ఇటీవలే ధర్మ పోరాట దీక్ష నిర్వహించినా, ఆసందర్భంలో నిర్వహించిన సభలను టిడిపి బహిరంగ సభలుగా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో టిడిపి తిరుపతిలో నిర్వహిస్తున్న ఈ ధర్మ దీక్ష సందర్భంగా భారీ బహిరంగసభ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇకపై టిడిపి...వరుస సభలు
మరోవైపు టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ చేపట్టే అన్ని కార్యక్రమాలను తిరుపతి నుంచే శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో కేంద్రంపై పోరాటానికి తిరుపతినే వేదికగా ఎంచుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సభ తర్వాత రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ సభలు నిర్వహించే యోచనలో పార్టీ ఉందని సమాచారం. ఇది ఓ రకంగా రానున్న ఎన్నికలకు శంఖారావంగా విశ్లేషిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు చిత్తూరు జిల్లా శ్రేణులతో పాటు పార్టీ అధినాయకత్వం కృషి చేస్తోంది.

చంద్రబాబు...పర్యటన...ఇలా...
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం సమయానికి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత డైరెక్టుగా సభా వేదిక వద్దకు వస్తారు. సిఎం చంద్రబాబు సమక్షంలో గత ఎన్నికల సమయంలో ఆనాటి ఎన్డీయే ప్రధాని అభ్యర్థి మోదీ ప్రసంగ పాఠాన్ని ఎల్ఈడీ తెరలపై ప్రదర్శిస్తారు. ఆ తరువాత చంద్రబాబు అందులో మోదీ పేర్కొన్న ప్రతి అంశాన్నీ ప్రస్తావిస్తూ నాడు ఏమి హామీ ఇచ్చారు? ఇప్పుడు ఎలా వాగ్దాన భంగానికి పాల్పడ్డారో.. వివరించనున్నారు. తెలుగు ప్రజల ఇలవేల్పు సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఇచ్చిన హామీని ఏ విధంగా విస్మరించారనేది విశదీకరించనున్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications