కుక్క పిల్ల కేసులేనా ? దీన్నీ చూడండి..! ఈడీపై టీడీపీ సెటైర్లు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోనూ బీజేపీతో ఎన్డీయే భాగస్వామిగా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల్లో కేంద్రంతో లాబీయింగ్ చేసుకుని నిధుల్ని, అనుమతుల్ని రాబట్టుకొంటున్న టీడీపీకి ఓ విషయంలో మాత్రం చిక్కులు తప్పడం లేదు. గతంలో వైసీపీ హయాంలో జగన్ మాట విని చంద్రబాబుపై స్కిల్ కేసు నమోదు చేసిన ఈడీ.. ఇప్పుడు అదే వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేసేందుకు మాత్రం వెనకాడుతోంది.
దీనిపై ఇవాళ టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేవలం రూ.3200 కోట్ల విలువైనది మాత్రమే కాదని, 30 వేల మంది ప్రాణాలకు సంబంధించిన వ్యవహారమంటూ ఆయన ఆరోపించారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిందని ఆయన తెలిపారు. మోడీ పహల్గాం తీవ్రవాదులపై తీసుకున్న చర్యలు చూశామని, ఇప్పుుడు ఆర్థిక ఉగ్రవాదులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈడీ అధికారులు చిన్న చిన్న వాటిపై చర్యలు తీసుకుంటారని, కానీ లిక్కర్ స్కాం లో చాలా మంది పేదల ప్రాణాలు పోయినా స్పందించడం లేదని సోమిరెడ్డి విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసు,కాళేశ్వరం పై ఈడీ విచారణ చేపడుతోందని, అలాగే ఈడి ఏపీ లో జరిగిన భారీ లిక్కర్ స్కాం పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 3200కోట్లే మద్యం స్కాం కాదు ఇది, 30 వేల మంది ప్రాణాలు బలిగొన్న ఏపీ మద్యం స్కాం పై విచారణ జరగాలన్నారు.

ఈ కేసులో వైసీపీ నేతల అవినీతి దేశ సరిహద్దులు దాటిందని సోమిరెడ్డి విమర్శించారు. ఈ స్కాం దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడల్ ఇవ్వాలన్నారు. 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నాను అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే అది ఫేక్ అని తెలియక ఈడీ వెంటనే స్పందించిందని వ్యంగాస్తాలు సంధించారు. అలాగే ఏపీ మద్యం స్కాం పై కూడా విచారణ చేయాలన్నారు. తద్వారా ఇంత పెద్ద మద్యం స్కాంపై ఈడీ నిర్లక్ష్యంగా ఉండటమేంటని ప్రశ్నించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications