అదీ ప్లాన్!: రేవంత్పై కర్నె, లంచం అడగమని కేసీఆర్

రూపాయి లంచం అడగం: కేసీఆర్
వచ్చే జూన్ కల్లా కల్వకుర్తి-నెట్టెంపాడు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. పాలమూరు జిల్లాలో 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. వారిని తాము ఒక్కరూపాయి లంచం అడగమన్నారు. అధికారులు వారిని ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.
ప్రైవేటు మెడికల్ కళాశాలలకు సుప్రీంకోర్టులో ఊరట
ప్రైవేటు మెడికల్ కళాశాలలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) అనుమతి రద్దు చేసిన కాలేజీల రెన్యువల్కు కోర్టు అవకాశం ఇచ్చింది. కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం కళాశాలల్లో పది రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.
సదుపాయాలు మెరుగుపరిచాక లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక రూ.10 కోట్ల బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సదుపాయాలు మెరుగుపరచకపోతే బ్యాంకు గ్యారెంటీని జప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 1000 మెడికల్ సీట్లు పెరగనున్నాయి.












Click it and Unblock the Notifications