తిరుపతిలో వైసీపీ గెలిస్తే భూములే కాదు ఏడుకొండలు కూడా అమ్మకానికి : ఎంపీ రామ్మోహన్ నాయుడు షాకింగ్ కామెంట్స్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేతలను రంగంలోకి దించి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ నుండి మంత్రులు రంగంలోకి దిగి ప్రచారం చేస్తుంటే, టిడిపి నుండి ఎంపీ రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ లతోపాటు కేశినేని శ్వేత, బండారు శ్రావణి, హరీష్ బాలయోగి వంటి యువ నేతలు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.

సీఎం జగన్ కు పాదసేవ చేసే మరో పార్లమెంటు సభ్యుడు కావాలా ?
ఇక తాజాగా టీడీపీ ఎంపీ ,యువనేత రామ్మోహన్ నాయుడు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి అభ్యర్థిగా పనబాక లక్ష్మి వంటి అవగాహన ఉన్న నేత ఎన్నికల బరిలోకి దిగడం గర్వంగా ఉందన్నారు. సమస్యలను పరిష్కరించే నాయకురాలు కావాలో, సీఎం జగన్ కు పాదసేవ చేసే మరో పార్లమెంటు సభ్యుడు కావాలో ? ప్రజలు తేల్చుకోవాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పార్లమెంట్లో రాష్ట్రం కోసం టీడీపీ రాజీలేని పోరాటం చేసిందని, ఇక ముందు కూడా చేస్తుందని అన్నారు.

22 మంది ఎంపీలను జగన్ తన కేసుల కోసం లాలూచీ పడేలా చేశారు
సీఎం హోదాలో చంద్రబాబు పీఎం మోడీని రాష్ట్రం కోసం నిలదీశారు అని, బీజేపీతో విభేదించింది రాష్ట్రం కోసమేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని పాదయాత్రలో చెప్పి ఎన్నికలలో ఎంపీలను గెలుచుకున్నారు అని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు 22 మంది ఎంపీలను జగన్ తన కేసుల కోసం లాలూచీ పడేలా చేశారని ఆరోపణలు గుప్పించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం లేఖలు రాయరు.. ఓట్ల కోసం ఇంటింటికీ జగన్ లేఖలు
విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకానికి పెడితే మాట్లాడడం లేదన్న రామ్మోహన్ నాయుడు, మోదీని ప్రశ్నిస్తే జగన్ ను జైల్లో పెడతారని భయపడి ఎంపీలు సైలెంట్ గా ఉంటున్నారు అని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నించేది టిడిపి మాత్రమే అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం లేదని , కానీ తిరుపతి ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటింటికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు.

విశాఖ భూములే కాదు గెలిస్తే తిరుపతి భూములు , ఏడుకొండలు కూడా అమ్మకానికి
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయని పేర్కొన్నారు . విశాఖలో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారని, తిరుపతి లో వైసీపీ గెలిస్తే తిరుపతి భూములే కాదు ఏడుకొండలు కూడా అమ్మే ప్రమాదముందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి పనబాక లక్ష్మిని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన రామ్మోహన్ నాయుడు జగన్ హయాంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు . రాష్ట్రం అభివృద్ధి శూన్యం అయిందని , అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరముందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications