జగన్ ఓ "ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్" .. అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ!
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై నరసరావుపేట ఎంపీ, టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా , వివిధ వర్గాల్లో అసహనం, విభేదాలు తలెత్తేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దుష్ప్రచారాలతో ప్రజల్లో విద్వేషాలు రేకెత్తిస్తున్నారంటూ దుయ్యబట్టారు. జగన్ను ఓ "ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్"గా అభివర్ణించారు. శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి జగన్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లావు శ్రీకృష్టదేవరాయలు లేఖ రాశారు.
జగన్కు జెడ్ ప్లస్ భద్రత ఉండగా కూడా భద్రతా లోపాలపై డ్రామాలు చేస్తున్నారని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. పాపిరెడ్డిపల్లి ఘటనను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. హెలికాప్టర్ ఘటనను ప్రస్తావిస్తూ, "వాస్తవంగా హెలికాప్టర్కు ఏమీ కాలేదంటే, 12.56కి దెబ్బతిందని చెబితే అదే హెలికాప్టర్ 1 గంటకే ఎలా టేకాఫ్ అయింది?" అని ప్రశ్నించారు. అంతే కాక, ముందుగా బెంగళూరు వెళతానని పార్టీ శ్రేణులకు చెప్పి, తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ భద్రతా వైఫల్యం అంటూ ఆరోపణలు చేయడం కుట్రకు సంకేతమని ఆరోపించారు.

అంతేకాదు, గత కొంతకాలంగా జగన్ పోలీసు అధికారులను బెదిరించడం, ధ్వంసాత్మక వ్యాఖ్యలు చేయడం వల్ల వారి మానసిక స్థితి దెబ్బతింటోందని, పోలీసులపై బహిరంగంగా హెచ్చరికలు, అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే పోలీసులను తొలగిస్తామన్న వ్యాఖ్యలు తీవ్రతరం గా పరిగణించాల్సినవని హితవు పలికారు.
వైసీపీ అధికారిక మీడియా వేదికలపై కూడా తప్పుదారి పట్టించేలా సమాచారం ఇచ్చి ప్రజల్లో భయభ్రాంతులు, ప్రభుత్వంపై అభద్రతాభావం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆక్షేపించారు. ఈ వ్యవహారమంతా కుట్రపూరితంగానే సాగుతోందని, జగన్ చేసిన డ్రామాలు, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసే కుట్రల మచ్చుతునకగా భావించాలని లేఖలో పేర్కొన్నారు.
పోలీసులపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని, అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను రాజకీయ ప్రత్యర్థులపై వాడుకుని, ఇప్పుడు అదే అధికారులపై బురదజల్లుతున్నారని విమర్శించారు. జగన్కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, ప్రజలు అదే కారణంగా ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదని అన్నారు.
నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఆయనపై ఇప్పటికే సీబీఐ 11 చార్జిషీట్లు, ఈడీ 9 మనీలాండరింగ్ కేసులు నమోదు చేశాయని గుర్తు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదన చేసిన జగన్, నేటి వరకు బెయిల్పైనే తిరుగుతున్నారు. ప్రజలను మోసం చేయడం, డ్రామాలు ఆడడం ఆయనకు అలవాటు," అన్నారు. 2019 ఎన్నికల ముందు జరిగిన తన చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్, అప్పటి ప్రభుత్వాన్ని తప్పుపట్టారని, ఇప్పుడు అదే హత్యపై సీబీఐ దర్యాప్తును కూడా అవమానిస్తున్నారని శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications