టీడీపీ పార్లమెంట్ పక్ష నేతగా గల్లా..! ప్రత్యేఖ హోదా వదిలేది లేదంటున్న జయదేవ్..!!
అమరావతి/హైదరాబాద్ : టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. లోక్సభలో పార్టీ నేతగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు, రాజ్యసభలో నేతగా ఎంపీ సుజనాచౌదరి వ్యవహరించనున్నారు. బుధవారం టీడీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జగన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో గురువారం ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడిన తెదేపా బృందం తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లనుంది.
తెదేపా తరఫున జగన్కు శుభాకాంక్షలు తెలిపేందుకు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు రేపు జగన్ ఇంటికి వెళ్లి కలవనున్నారు.ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని వైసీపీ అధినేత జగన్ మాజీ సీఎం చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఆయనకు ఫోన్ చేసిన జగన్ ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. మరోవైపు బుధవారం టీడీపీ నేతలు ఆయనను టీడీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. తనకు బదులుగా ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications