బీసీల గురించి మీరా మాట్లాడేది .. మీ జన్మలో బీసీలను రాజ్యసభకు పంపించారా : ఏపీ డిప్యూటీ సీఎం
టిడిపి నేతలను అక్రమ అరెస్టులు చేశారని, బీసీలపై ఉన్న అక్కసును ప్రదర్శిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్న టిడిపి నాయకులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. బీసీల గురించి మీరా మాట్లాడేది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాసనమండలిలో అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టిడిపి ఎమ్మెల్సీ జగదీశ్వర రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కావాలని టిడిపి నేతను అరెస్ట్ చేశామని, బీసీలు అంటే ప్రభుత్వానికి చిన్నచూపు అని చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడినట్లుగా తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్మును దొంగతనం చేశాడు కాబట్టే ఆయన జైలుకు వెళ్ళాడు అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

ఇక అంతే కాదు మాటిమాటికి బిసి కార్డును వాడుతున్న టిడిపి నేతలను ఆయన తూర్పార పెట్టాడు. పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడైనా మీ జన్మలో బీసీలను రాజ్యసభకు పంపించారా అంటూ ఆయన మండిపడ్డారు . ఇక అంతే కాదు టిడిపి పాలనలో ఏనాడైనా బీసీల కోసం బడ్జెట్ పెట్టారా అంటూ ఆయన టిడిపి నేతలను నిలదీశారు. బీసీల గురించి మాట్లాడే హక్కు టిడిపి నేతలకు లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. తప్పుచేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications