బాబు, లోకేష్ను తిట్టిపోసిన ఏబీవీపీ సభలో సుజనా చౌదరి, చిక్కులు!
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి చిక్కుల్లో పడ్డారు! అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభకు సుజన హాజరుకావడంపై టిడిపి శ్రేణులు అసంతృప్తికి లోనవుతున్నారని తెలుస్తోంది.
గుంటూరులో జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో సుజనా చౌదరి పాల్గొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో టిడిపి - బిజెపిలు కలిసి నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుజన ఏబీవీపీ సమావేశాలకు హాజరయ్యారు.

అయితే, సుజనా సమావేశం నుంచి వెళ్లిపోయాక.. ఏబీవీపీ జాతీయ నేత సురేష్... ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పైన విమర్శలు చేశారు. సుజన పాల్గొన్న సమావేశంలో... పార్టీ అధినేత, ఆయన తనయుడి పైన విమర్శలు చేయడాన్ని టిడిపి జీర్ణించుకోలేకపోతోందంటున్నారు.
గుంటూరులో జరిగిన ఏబీవీపీ సభకు సుజనా చౌదరితో పాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్యతో పాటు సుజన కూడా పాల్గొని, ప్రసంగించారు. సాధారణంగా ఒక పార్టీ సమావేశానికి లేదా ఓ పార్టీ విభాగం సమావేశానికి.. మిత్రపక్షణమైనా మరో పార్టీ నేతలు హాజరుకారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications