పార్లమెంట్ లో చంద్రబాబు అరెస్ట్ అంశం - ప్రధాని జోక్యానికి డిమాండ్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పార్లమెంట్ ను తాకింది. ఈ రోజు నుంచి ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రస్తుత భవనంలో చివరి రోజు. రేపటి నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ సమయంలో టీడీపీ లోక్ సభా పక్ష నేత గల్లా జయదేవ్ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాని జోక్యం కోరారు. వైసీపీ నేత మిధున్ రెడ్డి కౌంటర్ చేసారు. స్పీకర్ ఈ సమయంలో స్పష్టత ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పైన టీడీపీ లోక్ సభలో లేవనెత్తింది. చంద్రబాబు అరెస్ట్ ఏపీ చరిత్రలో బ్లాక్ డే గా ఎంపీ జయదేవ్ పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రధాని, హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరారు.

చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు చౌకబారు ఎత్తుగడలు వేసారని విమర్శించారు. చంద్రబాబుకు డబ్బు అందినట్లు ఎలాంటి ఆరోపణలు చూపలేదన్నారు. రాజకీయ కక్ష్య సాధింపు చర్యలు ఆపేలా ప్రధాని చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబును వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేసారు.
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును పార్లమెంటులో ప్రస్తావించిన గల్లా జయదేవ్ . రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసారని, స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కాకుండానే అరెస్టు చేశారని లోక్ సభలో ప్రస్తావించారు.#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu… pic.twitter.com/vuVgOsgnZs
— Telugu Desam Party (@JaiTDP) September 18, 2023
గల్లా ప్రసంగం సమయంలో వైసీపీ లోక్ సభా పక్ష నేత మిధున్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. కేసులో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. ఇప్పటి వరకు చంద్రబాబు చేసిన అవినీతిని స్టేల ద్వారా తప్పించుకున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఈ కేసులో ప్రమేయం పూర్తి ఆధారాలతో నిరూపితం అయిందని చెప్పారు.

చంద్రబాబు పీఏకు ఐటీ నోటీసు ఇవ్వగా..ఆయన విదేశాలకు పారిపోయారని సభలో వివరించారు. ఈ కేసులో చేసిన అవినీతి సొమ్ము 80 షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేలిందని చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా అవినీతి కేసు అని..చంద్రబాబు ప్రమేయం పైన పూర్తి ఆధారాలు ఉన్నాయని మిధున్ రెడ్డి వివరించారు.
మిధున్ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఇరు పక్షాల నుంచి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోర్టులో ఉన్న సమయంలో సభలో చర్చ సరికాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు బెయిల్ అంశం కోర్టు ముందు ఉందని..విచారణ చేసి కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. కోర్టులో విచారణలో ఉన్న ఈ అంశం పైన సభలో చర్చకు అనుమతించనని స్పష్టం చేసారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications